हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Kaleshwaram Project : కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక

Divya Vani M
Kaleshwaram Project : కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక

తెలంగాణలోని కాళేశ్వరం (Kaleshwaram Project)లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission) సమర్పించిన నివేదికపై ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నివేదికను సమగ్రంగా పరిశీలించి, సారాంశం సిద్ధం చేయడానికి శుక్రవారం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది.నీటిపారుదల, న్యాయ, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటీ ఆగస్టు 4న రాష్ట్ర మంత్రివర్గానికి తన నివేదికను సమర్పించనుంది. ఆ తరువాత క్యాబినెట్ సమావేశంలో నివేదికలోని సూచనలు, సిఫార్సులపై చర్చించనున్నారు.

నివేదిక ముఖ్యమంత్రికి అందజేత

సుమారు 700 పేజీల ఈ నివేదికను కమిషన్ గురువారం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేసింది. శుక్రవారం ఈ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సీఎం చర్చించారు.

బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవకతవకల ప్రస్తావన

గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవకతవకలను నివేదిక ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా దోషులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలా లేదా అన్నదానిపై క్యాబినెట్‌లో చర్చ జరగనుంది.

తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు?

ప్రాజెక్టులో లోపాలు చేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. నివేదికలోని అంశాలు, సిఫార్సులు వెలుగులోకి రాగానే తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

Read Also : Revanth Reddy : జర్నలిజం పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న హరీష్ రావు!

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న హరీష్ రావు!

మంత్రులు కారు రియల్ఎస్టేట్ బ్రోకర్లు: కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

మంత్రులు కారు రియల్ఎస్టేట్ బ్రోకర్లు: కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారణ

ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారణ

ఒక్కరోజే రూ. 10 వేలు జంప్.. క్వింటా మిర్చి 50 వేలు

ఒక్కరోజే రూ. 10 వేలు జంప్.. క్వింటా మిర్చి 50 వేలు

లిక్కర్ స్కామ్ క్లీన్‌చిట్‌పై కవిత స్పందన

లిక్కర్ స్కామ్ క్లీన్‌చిట్‌పై కవిత స్పందన

తెలంగాణలో కొత్తగా 100 పబ్లిక్ స్కూళ్లు..

తెలంగాణలో కొత్తగా 100 పబ్లిక్ స్కూళ్లు..

యోగి, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటే: ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

యోగి, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటే: ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ కేసులో 23 మందిని డిశ్చార్జ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు

ఢిల్లీ లిక్కర్ కేసులో 23 మందిని డిశ్చార్జ్ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు

అత్యధిక జీతం పొందే డిపార్ట్‌మెంట్ ఇదే!

అత్యధిక జీతం పొందే డిపార్ట్‌మెంట్ ఇదే!

లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు క్లీన్ చిట్

లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు క్లీన్ చిట్

బడ్జెట్ ప్రణాళికపై ముమ్మర కసరత్తు

బడ్జెట్ ప్రణాళికపై ముమ్మర కసరత్తు

CBSC సహా అన్ని స్కూళ్లలోతెలుగు తప్పనిసరి

CBSC సహా అన్ని స్కూళ్లలోతెలుగు తప్పనిసరి

📢 For Advertisement Booking: 98481 12870