News Telugu: దేశ రాజకీయాల్లో ఓ సంచలనకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ADR) తన తాజా నివేదికలో వెల్లడించిన ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల్లో 12 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు స్వయంగా అఫిడవిట్లలో పేర్కొన్నారు.

కేసుల సంఖ్యలో అగ్రస్థానంలో సీఎం రేవంత్ రెడ్డి
ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అగ్రస్థానంలో నిలిచారు. ఆయనపై నమోదైన కేసుల సంఖ్య 89. ఇది మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉండడం గమనార్హం.
ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులపై కేసులు
రేవంత్ తర్వాత తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్పై 47 కేసులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై 19 కేసులు (19 cases Chandrababu Naidu) ఉన్నాయని నివేదిక పేర్కొంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై 13, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్పై 5 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఇక మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మరియు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్లపై చెరో 4 కేసులు నమోదయ్యాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై 2, పంజాబ్ సీఎం భగవంత్ మాన్పై ఒక కేసు మాత్రమే ఉన్నట్లు నివేదికలో వివరించారు.
తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్న ముఖ్యమంత్రులు
కేవలం కేసుల సంఖ్య మాత్రమే కాదు, వాటి తీవ్రత కూడా ఆందోళన కలిగించే అంశం. ఈ జాబితాలోని కనీసం 10 మంది ముఖ్యమంత్రులపై హత్యాయత్నం, కిడ్నాపింగ్, అవినీతి వంటి సీరియస్ ఆరోపణలు ఉన్నాయని ఏడీఆర్ స్పష్టం చేసింది.
రాజకీయ ప్రాధాన్యం పెంచిన నివేదిక
ఈ నివేదిక రాజకీయంగా మరింత ప్రాధాన్యం పొందింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తాజాగా పరిశీలిస్తున్న ఒక బిల్లులో – ఐదేళ్ల కంటే ఎక్కువ శిక్షపడే కేసులో అరెస్టై 30 రోజులు జైలులో ఉన్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు పదవి నుంచి తప్పుకోవాలి అన్న నిబంధనను ప్రతిపాదిస్తోంది. ఈ నేపథ్యంలో 12 మంది ముఖ్యమంత్రులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు చర్చనీయాంశమవుతున్నాయి.
అఫిడవిట్ల ఆధారంగా తయారైన నివేదిక
ఏడీఆర్ నివేదికలోని వివరాలు యాదృచ్ఛికంగా కాకుండా, ఆయా ముఖ్యమంత్రులు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లలో పొందుపరిచిన సమాచారం ఆధారంగానే సేకరించబడినట్లు సంస్థ స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: