నగరవాసులకు పాస్పోర్ట్ సేవలను మరింత సులభతరం చేసేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లోని(Hyderabad) మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) (MGBS)మెట్రో స్టేషన్లో కొత్తగా ఒక పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని (పీఎస్కే)(PSK) ఏర్పాటు చేశారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

పీఎస్కేల చిరునామాలు మార్పు
ఇంతకుముందు అమీర్పేటలోని ఆదిత్య ట్రేడ్ సెంటర్లో ఉన్న పాస్పోర్ట్(Passport) సేవా కేంద్రాన్ని ఇప్పుడు ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్కు పూర్తిగా తరలించారు. అదేవిధంగా, టోలీచౌకీ షేక్పేట్లోని ఆనంద్ సిలికాన్ చిప్ భవనంలో పనిచేస్తున్న మరో కేంద్రాన్ని రాయదుర్గం పాత ముంబయి రోడ్డులోని సిరి బిల్డింగ్లోకి మార్చారు. మంగళవారం నుంచి ఈ రెండు కేంద్రాలు తమ కొత్త ప్రదేశాల నుంచి పూర్తిస్థాయిలో సేవలను అందిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
హైదరాబాద్లో పాస్పోర్ట్ సేవల విశేషాలు
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, పాస్పోర్ట్ల జారీలో హైదరాబాద్ దేశంలోనే ఐదో స్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఐదు పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ప్రజలకు సేవలందిస్తున్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు.
కొత్త పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి?
మహాత్మా గాంధీ బస్ స్టేషన్ మెట్రో స్టేషన్ మరియు రాయదుర్గం సిరి బిల్డింగ్లో కొత్త కేంద్రాలు ప్రారంభమయ్యాయి.
అమీర్పేటలోని పీఎస్కేను ఎక్కడికి మార్చారు?
అమీర్పేటలోని పీఎస్కేను ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్కు తరలించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: