తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవర్తన పెద్ద దుమారాన్నే రేపింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. మంత్రి ప్రవర్తనను సిగ్గుపడాల్సిన విషయమని, కాంగ్రెస్ నేతల అహంకారానికి ఇదే పరాకాష్ట అని ఆమె మండిపడ్డారు.
కవిత తన ట్విట్టర్ ఖాతాలో చేసిన వ్యాఖ్యల్లో, ఒక మంత్రి ఇలా ప్రవర్తించడం పూర్తి అధికార యంత్రాంగాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. “అధికారులపై మమకారంతోనే వారు సమర్థవంతంగా పనిచేస్తారు. కానీ పొంగులేటి ప్రవర్తన ఇలా ఉంటే ప్రజాసేవను ఎలా నమ్మిస్తారు?” అంటూ ఆమె ప్రశ్నించారు.

కరీంనగర్ కలెక్టర్ పేమేలా సత్పతకు బీఆర్ఎస్ పూర్తి మద్దతుగా నిలుస్తుందని, ఈ అంశంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మంత్రుల ప్రవర్తనలో పారదర్శకత ఉండాలని, ఇది ప్రజాస్వామ్యంలో కీలకమని కవిత హితవు పలికారు.
ఈ ఘటనతో అధికారులు, ప్రజల్లో ఆందోళన ఏర్పడినట్లు తెలుస్తోంది. మంత్రి ప్రవర్తనపై అధికారుల సంఘం కూడా విచారం వ్యక్తం చేసింది. అధికారులపై నమ్మకం లేకుండా చేస్తే పాలనలో పరిస్థితులు అధ్వాన్నంగా మారతాయని వారు అభిప్రాయపడ్డారు.
ఈ వివాదం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ నేతల కౌంటర్తో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అధికారులను గౌరవించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని కవిత పిలుపునిచ్చారు. ఈ వివాదం ఎటువంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.