తెలంగాణ రాజకీయాల్లో కొత్త దుమారం రేగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరు పట్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి మరింత సమన్వయంతో ముందుకు సాగాలని, ఆవేశపూరిత వైఖరి రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదకరమని మంత్రి హితవు పలికారు. కౌశిక్ రెడ్డి తన తీరు మార్చుకోవాలని, లేకపోతే తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని పేర్కొన్నారు. రాజకీయాల్లో అనుభవం కంటే ఆచరణ చాలా ముఖ్యమని మంత్రి అన్నారు.
ఇక కౌశిక్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ మధ్య రాజకీయ విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో పార్టీకి చెందిన ఈ ఇద్దరి నేతలు…ఇప్పుడు వేరు వేరు పార్టీలలో కొనసాగుతుండడంతో వీరి మధ్య ఉన్న విభేదాలు బహిరంగ చర్చకు దారి తీసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉత్తమ్ సూచనపై కౌశిక్ రెడ్డి ఇంకా స్పందించలేదు.