Minister Tummala: మంత్రి ఫోన్ చోరీ.. ఆపై స్వాధీనం

Read Time:  1 min
Minister Tummala:
Minister Tummala:
FONT SIZE
GET APP

కరీంనగర్ జిల్లాలో జరిగిన ఓ ఘటన స్థానిక రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) ఫోన్ చోరీకి గురైన సంఘటన క్షణాల్లోనే హాట్ టాపిక్‌గా మారింది. కేశవపట్నం మండలంలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.సమాచారం ప్రకారం, తుమ్మల నాగేశ్వరరావు కేశవపట్నంలోని రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం (Ration card distribution program) ముగిసిన తరువాత వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో తన మొబైల్ ఫోన్ కనిపించకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన సిబ్బంది, స్థానిక పోలీసులు అప్రమత్తమై శోధన చర్యలు ప్రారంభించారు.

శోధనలో భాగంగా

మంత్రి వంటి కీలక పదవిలో ఉన్న వ్యక్తి మొబైల్ ఫోన్ దొంగతనం జరగడం భద్రతా పరంగా ఆందోళన కలిగించే అంశమని అధికార వర్గాలు గుర్తించాయి.శోధనలో భాగంగా పోలీసులు సమీప గ్రామాలల్లో వెతికారు. కరీంపేట్ గ్రామంలోని ఓ మహిళ వద్ద మంత్రి ఫోన్ దొరకడంతో కేసులో పెద్ద మలుపు తిరిగింది.

తుమ్మల నాగేశ్వరరావు ఏఏ హోదాల్లో పనిచేశారు?

ఆయన మంత్రిగా, శాసనసభ్యుడిగా, పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యుడిగా పనిచేశారు. రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ వంటి విభాగాల్లో మంత్రిగా సేవలందించారు.

కరీంనగర్ ఇంచార్జ్ మంత్రిగా ఆయన ఏ పనులు చేస్తున్నారు?

కరీంనగర్ జిల్లాలో సంక్షేమ పథకాలు, రేషన్ కార్డుల పంపిణీ, అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి పలు ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/hyderabad-drugs-party-it-employees-arrested/telangana/525083/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.