हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News:DSP: గ్రూప్ 1 లో 474వ ర్యాంక్ సాధించిన కరీంనగర్ జిల్లా మోదుంపల్లి మహేశ్వరి

Pooja
Telugu News:DSP: గ్రూప్ 1 లో 474వ ర్యాంక్ సాధించిన కరీంనగర్ జిల్లా మోదుంపల్లి మహేశ్వరి

తండ్రి లేని లోటు, తల్లి కూలి పనిపై ఆధారపడిన నిత్య ఆర్థిక ఇబ్బందులు(Financial difficulties) ఏవీ తన లక్ష్యానికి అడ్డు కాదని నిరూపించింది కరీంనగర్ జిల్లా, మానకొండూరు మండలానికి చెందిన మోదుంపల్లి మహేశ్వరి. ‘చదువుతోనే జీవితం మారుతుంది‘ అనే తల్లి మాటలను ఆయుధంగా మలచుకుని కఠోరంగా శ్రమించిన ఆమె, ఇటీవల విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో 474వ ర్యాంక్ సాధించి, డీఎస్పీ (DSP) ఉద్యోగాన్ని దక్కించుకుంది. దీంతో ఆమె సొంత గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.

Read Also: Hyderabad:సద్దుల బతుకమ్మ వేళ విషాదం..ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

DSP

ఆర్థిక కష్టాలను జయించి: కూలీ బిడ్డ డీఎస్పీ

నాలుగేళ్ల క్రితం తండ్రి లక్ష్మణ్ మరణించడంతో, తల్లి శంకరమ్మ కూలి పనులు చేస్తూ, వచ్చిన కొద్దిపాటి డబ్బుతోనే మహేశ్వరిని ఉన్నత చదువులకు పంపింది. అద్దె ఇళ్లలో చదువుకోవడం, కొత్త పుస్తకాలు కొనడానికి డబ్బు లేక పాత పుస్తకాలతోనే చదువుకోవడం, ప్రతి పైసా ఆదా చేసుకోవడం వంటి ఎన్నో కష్టాలను మహేశ్వరి ఎదుర్కొంది. అయినప్పటికీ, చదువుపై ఆమెకున్న నిబద్ధత చెక్కుచెదరలేదు. ఆమె తన ప్రాథమిక విద్యను రేకొండ ప్రభుత్వ పాఠశాలలో, పదవ తరగతిని కరీంనగర్ సాగర్ మెమోరియల్ హైస్కూల్‌లో (మండల్ టాపర్‌గా), ఇంటర్మీడియట్‌ను లయోల జూనియర్ కాలేజ్‌లో, డిగ్రీని కరీంనగర్ గవర్నమెంట్ డిగ్రీ మహిళా కళాశాలలో, పీజీని గోదావరిఖని యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్‌లో పూర్తి చేసింది. ఉన్నత చదువు పూర్తయిన తర్వాతే ఆమె పోటీ పరీక్షలకు సిద్ధమైంది.

తన విజయంపై మహేశ్వరి మాట్లాడుతూ, “నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినా, కష్టపడి చదివితే పెద్ద విజయాలు(Big wins) సాధించవచ్చు. నా విజయం మా గ్రామంలోని ఆడపిల్లలందరికీ స్ఫూర్తి కావాలి” అని చెప్పింది. ఆమె సాధించిన ఈ గొప్ప విజయాన్ని గ్రామస్తులు ఘనంగా అభినందించారు. వారు మహేశ్వరికి సన్మాన సత్కారాలు చేసి, ఓపెన్ టాప్ జీపులో ఊరేగించారు.

మహేశ్వరి కుటుంబ నేపథ్యం ఏమిటి?

ఆమె తండ్రి నాలుగు సంవత్సరాల క్రితం చనిపోయారు. ఆమె తల్లి శంకరమ్మ కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించింది.

మహేశ్వరి ఏ సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) పూర్తి చేశారు?

ఆమె గోదావరిఖని యూనివర్సిటీ పీజీ కాలేజ్‌లో ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870