Latest News: Urea – రోడ్లపైనే వంటావార్పు పాసు పుస్తకాలను తగలబెట్టిన రైతులు

Read Time:  1 min
Latest News
Latest News
FONT SIZE
GET APP

హైదరాబాద్ : రాష్ట్రంలో యూరియా కొరతపై నిరసనలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. యూరియా ఇవ్వడం లేదనే ఆగ్రహంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగులు, అధికారులను రైతులు నిర్బంధిస్తున్నారు. మరోపక్క పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను తగుల పెట్టడం, రోడ్లపై వంటా వార్పు, ధర్నాలు, ఆందోళనలను తీవ్రతరం అవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర యూరియా (Urea) కొరతపై రైతులు వరుస నిరసనలు చేపట్టారు. యూరియా కోసం ఎదురు చూసినా తగినంత సరఫరా లేకపోవడంపై ఆందోళన చెందుతున్న రైతులు రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేటలో రైతులు పట్టాదార్ పాస్బుక్లు, ఆధార్ కార్డుల ఫోటో కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు.

ఆధార్ కార్డుల ఫోటో కాపీలను తగలబెట్టారు

గంటల తరబడి వేచి చూసినా యూరియా టోకెన్లు జారీ చేయడంలో విఫలమైన సొసైటీ అధికారుల తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సహనం కోల్పోయిన కొందరు రైతులు పట్టాదార్ పాస్ బుక్ కు, ఆధార్ కార్డుల ఫోటో కాపీలను తగలబెట్టారు. అంతేకాకుండా వ్యవసాయ సహకార పరపతి సంఘం సిబ్బందిని కార్యాలయాల్లో బంధించారు. ఇదే జిల్లాలోని మరిపెడ యూరియా స్టాక్ వచ్చిందనే సమాచారం అందడంతో రైతులు పీఏసీఎస్ గేటు దూకి లోపలికి పరిగెత్తారు. యూరియా కోసం పరకాలభూపాలపల్లి (Parakalabhupalapalli) ప్రధాన రహదారిలోని మాందారిపేట వద్ద రైతులు నిరసన తెలిపారు. అలాగే, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో యూరియా కొరత కారణంగా రైతులు సహకార సంఘం కార్యాలయాల వద్ద పొడవైన క్యూలలో వేచి ఉండాల్సి వస్తోందని, అయినా దొరకడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Latest News
Latest News

యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ

యూరియా తగినంతగా సరఫరా చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు. కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ మండలంలోని గానుగపాడు సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు ధర్నా చేశారు. తగినంత పరిమాణంలో యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలోని జూలూరుపాడులో, రైతులు ప్రాథమిక వ్యవసాయ,సహకార సంఘం సిబ్బందిని కార్యాలయంలోనే బంధించారు.ప్రతి రైతుకు కనీసం మూడు బస్తాల యూరియా అందించాల్సి ఉండగా, కేవలం ఒక బస్తా మాత్రమే ఇచ్చారని విమర్శించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కార్యాలయానికి వచ్చి షట్టర్ తెరిచారు.

నిరసన కారణంగా వాహనాలు అనేక కిలోమీటర్ల

సహకార సంఘం అధికారులు 40 టన్నుల యూరియాకు ఆర్డర్ ఇచ్చామని, కానీ పది టన్నుల యూరియా మాత్రమే వచ్చిందని చెప్పారు. రైతులకు స్టాక్స్ వచ్చిన వెంటనే మిగిలినది ఇస్తామని చెప్పారు. అలాగే వరంగల్ జిల్లా ఖానాపురం వద్ద జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో రైతులు వంట వార్పు నిర్వహించారు. నిరసన కారణంగా వాహనాలు అనేక కిలోమీటర్ల మేర నిలిచి పోయాయి. క్యూలైన్లో రైతులు స్పృహ కోల్పోయిన సంఘటనలు అనేక చోట్ల జరిగాయి.
యూరియా తగినంతగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ, ఇదే జిల్లాలోని నర్సంపేటలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. భూపాలపల్లి, డోర్నకల్ మరియు మరిపెడ వంటి అనేక చోట్ల ఇలాంటి నిరసనలు కనిపించాయి.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-secunderabad-railway-station-railway-arrangements-for-festive-rush/telangana/542238/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.