విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి ఫరూఖీ
హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా, గతేడాది ఇదే నెల 20న నమోదయిన గరిష్ట డిమాండ్ 15570 మెగావాట్లు కాగా, ఈ నెల 8వ తేదీనే 15906 మెగావాట్లుగా నమోదయ్యింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) పరిధిలో గతేడాది వానా కాలం పంటల సీజన్ లో సెప్టెంబర్ 20న నమోదయిన 9910 మెగావాట్ల గరిష్ట డిమాండ్ను తాజాగా ఈ నెల 8న 10450 మెగావాట్ల గరిష్ట డిమాండ్తో, 203.38 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగిందని ఆ సంస్థ సిఎండి ముషారఫ్ ఫరూఖీ (CMD Musharraf Farooqui) వెల్లడించారు. పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో హైదరాబాద్లోని ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజినీర్ల, సూపెరింటెండింగ్ ఇంజినీర్లతో మంగళవారం సీఎండీ ఫరూఖీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
గ్రామీణ జిల్లాల విద్యుత్ అధికారులు
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న గృహ, పారిశ్రామిక విద్యుత్ (Industrial electricity) వినియోగాలకు తోడు, ఈ వానా కాలం పంటల సీజన్ లో వ్యవసాయ వినియోగం కూడా భారీగా పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ జిల్లాల విద్యుత్ అధికారులు మరింత అప్రమత్తంగా వుంటూ, విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు.
తాజాగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో నీటి లభ్యతతో రాష్ట్ర వ్యాప్తంగా వానా కాలం పంటల సాగు గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. గత ఏడాది ఇదే సీజన్ తో పోల్చుకుంటే విద్యుత్ వినియోగం దాదాపు 50 శాతానికి మించి నమోదవుతుందని వెల్లడించారు. ప్రధానంగా దక్షి ణ డిస్కం పరిధిలోని జిల్లాల్లో దాదాపు రెట్టింపు స్థాయిలో విద్యుత్ వినియోగం జరుగుతుందని చెప్పారు.

యూనిట్ల వినియోగంతో
మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో గతేడాది ఇదే నెల 1వ తేదీన 13.6 మిలియన్ యూనిట్లుగా వున్న వినియోగం ఈ ఏడాది అదే రోజున 33.82 మిలియన్ యూనిట్ల వినియోగంతో దాదాపు 148 పెరుగుదలను నమోదు చేసిందని పేర్కొన్నారు. ఇదే విధంగా పలు జిల్లాల్లో వినియోగం భారీగా పెరుగుతున్నదన్నారు.
దక్షిణ డిస్కం పరిధిలో, ఈ ఏడాది అదనంగా దాదాపు 26 వేల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ లు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. ప్రస్తుతం గ్రామీణ జిల్లాల్లో 4.92 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు వున్నాయని, ఎక్కడైనా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ లో సమస్యలు ఏర్పడితే, వెంటనే మార్చేందుకు గాను తప్పనిసరిగా ప్రతి సర్కిల్ పరిధిలో తగినన్ని రోలింగ్ స్టాక్ లో అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: