हिन्दी | Epaper

KTR: రాష్ట్రంలో ఎరువుల కొరతపై కేటీఆర్ విమర్శలు

Sharanya
KTR: రాష్ట్రంలో ఎరువుల కొరతపై కేటీఆర్ విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో రైతుల సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో ఎరువుల కొరత (Fertilizer shortage), ధరల పెరుగుదల, పాలకుల దారుడ్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (KTR) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, పైగా వేసవిలో మరియు ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ఎరువుల లభ్యతపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

ఎరువుల కొరత: రైతులపై ప్రభావం

కేటీఆర్ (KTR)పేర్కొన్న విధంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.94 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల లోటు ఎందుకు ఏర్పడిందో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సకాలంలో ఎరువులు అందకపోవడం వల్ల రైతులు నాణ్యమైన పంటలు సాగు (Farmers cultivate quality crops) చేయలేకపోతున్నారు.

ధరల పెరుగుదలపై ఆరోపణలు

మార్కెట్‌లో కేవలం రూ. 266కు దొరకాల్సిన యూరియా బస్తా ధర ఇప్పుడు రూ. 325కి పెరిగిందని, ఈ ధరల పెరుగుదలకు ఎవరు బాధ్యత వహించాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. వ్యవసాయం కోసం అప్పులు తీసుకున్నా, ఎరువులు దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు.

కృత్రిమ కొరత వెనుక కుట్ర?

ఇక్కడ మరో కీలక అంశాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కొంతమంది కావాలనే కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీని వెనుక ఎవరున్నారో తేల్చేందుకు తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని కేటీఆర్ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది రైతులకు రుణమాఫీ, రైతు భరోసా వంటి హామీలను నెరవేర్చిందన్న దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలతో చేసిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Ponguleti Srinivas: రాష్ట్రంలో కొత్త స్టాంప్ డ్యూటీ బిల్లు తీసుకొస్తాం: మంత్రి పొంగులేటి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870