हिन्दी | Epaper
కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

Latest News: KTR – మంత్రి బండి సంజయ్‌పై కేటీఆర్ పరువు నష్టం దావా

Anusha
Latest News: KTR – మంత్రి బండి సంజయ్‌పై కేటీఆర్ పరువు నష్టం దావా

తెలంగాణ రాజకీయ వర్గాల్లో మరోసారి పెద్ద చర్చకు కారణంగా నిలిచింది కేటీఆర్ – బండి సంజయ్ వివాదం. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Minister Bandi Sanjay) తనపై ఆధారాలు లేకుండా తీవ్రమైన ఆరోపణలు చేశారని, దాంతో తన వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతిన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయిస్తూ రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు.

కేటీఆర్ (KTR) న్యాయవాదుల ప్రకారం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ ఎటువంటి సాక్ష్యాలు లేకుండా తన పేరును లాగారని, ఈ వ్యాఖ్యలు ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలను కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజం అయినప్పటికీ, నిరాధార ఆరోపణలు వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని కేటీఆర్ వైపు నుంచి వాదనలు వినిపిస్తున్నాయి.

 KTR
KTR

బండి సంజయ్ స్పందించకపోవడంతో పాటు క్షమాపణ చెప్పడానికి

ఇప్పటికే ఆగస్టు 11న కేటీఆర్ తరఫున బండి సంజయ్‌కు న్యాయవాదులు లీగల్ నోటీసు (Legal notice)పంపించారు. ఆ నోటీసులో ఆరోపణలకు సంబంధించి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. కానీ బండి సంజయ్ స్పందించకపోవడంతో పాటు క్షమాపణ చెప్పడానికి కూడా నిరాకరించారని కేటీఆర్ బృందం చెబుతోంది. ఈ పరిస్థితుల్లోనే ఆయన న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకుని సిటీ సివిల్ కోర్టు (City Civil Court) లో పిటిషన్ దాఖలు చేశారు.ఈ దావాలో కేటీఆర్ పలు కీలక విషయాలను ప్రస్తావించారు.

బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలకు గాను బేషరతుగా, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో తన పరువుకు నష్టం కలిగించేలా ఎటువంటి వ్యాఖ్యలు, ప్రసంగాలు, ప్రచురణలు చేయకుండా బండి సంజయ్‌ను నిరోధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అలాగే, ఇప్పటికే ఆన్‌లైన్ వేదికలు, సామాజిక మాధ్యమాలు, ఇతర వార్తా మాధ్యమాలలో ఉన్న పరువు నష్టపరిచే కథనాలు, వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/kadiyam-srihari-should-resign-dasyam-vinay-bhaskar/telangana/547911/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870