తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యే (MLA) లు చేరారని గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రివర్గ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎవరూ చేరలేదని స్పష్టం చేశారు.
అనర్హతపై నిర్ణయం
3 నెలల లోపు పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి,పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత కేసు (Disqualification case) లో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జి,మేము ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకుంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టు అవుతుందని.. అందుకే స్పీకర్కు నిర్ణయం తీసుకోమని గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు.
శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎవరు?
శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన నాయకుల్లో ఒకరు. రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, తెలంగాణ కోసం నిరంతర పోరాటం చేశారు. నల్గొండ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి ప్రజాదరణ పొందారు. ఆయన తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా కూడా సేవలు అందించారు.
నల్గొండ జిల్లా ఎమ్మెల్యే ఎవరు?
నల్గొండ జిల్లా మొత్తం 12 నియోజకవర్గాలుగా విభజించబడింది. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉంటుంది. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: