తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) అంశాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమాల్లో నిండి ఉన్న వారు ఎంతటి వారైనా జైలుకు వెళ్లక తప్పదని ఆయన స్పష్టం చేశారు.

ఇంజినీర్ల వద్దే కోట్లు దొరుకుతున్నాయంటే..!
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) కు సంబంధించి అధికారులు, ఇంజినీర్ల వద్దే కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయని మంత్రి ఆరోపించారు. “ఇంజినీర్ల స్థాయిలోనే ఇంత సంపద దొరికితే.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు వద్ద ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ఊహించండి!” అంటూ ఆయన విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ విచారణ దశలో
ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, త్వరలో జరిగే కేబినెట్ సమావేశం అనంతరం ఈ వ్యవహారంపై కీలక ప్రకటనలు చేయనున్నట్టు చెప్పారు.
సీఎం రేవంత్పై ప్రశంసలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించిన కోమటిరెడ్డి.. “రేవంత్ జూనియర్ అయినా సీనియర్ నాయకులను గౌరవిస్తున్నారు. పార్టీ అంతా ఒక టీమ్గా పనిచేస్తోంది” అని పేర్కొన్నారు. ఇది సమష్టి నాయకత్వానికి నిదర్శనమని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టును కట్టనివ్వబోమని, శ్రీశైలం ప్రాజెక్టును కాపాడతామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
కవితపై ఘాటు వ్యాఖ్య
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా..
“ఆమె ఎవరో నాకు తెలియదు” అంటూ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: