हिन्दी | Epaper

Komatireddy Venkat Reddy: కేసీఆర్, హరీశ్ వేల కోట్లు దండుకున్నారు: కోమటిరెడ్డి

Sharanya
Komatireddy Venkat Reddy: కేసీఆర్, హరీశ్ వేల కోట్లు దండుకున్నారు: కోమటిరెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) అంశాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమాల్లో నిండి ఉన్న వారు ఎంతటి వారైనా జైలుకు వెళ్లక తప్పదని ఆయన స్పష్టం చేశారు.

Komatireddy Venkat Reddy
Komatireddy Venkat Reddy

ఇంజినీర్ల వద్దే కోట్లు దొరుకుతున్నాయంటే..!

కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) కు సంబంధించి అధికారులు, ఇంజినీర్ల వద్దే కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయని మంత్రి ఆరోపించారు. “ఇంజినీర్ల స్థాయిలోనే ఇంత సంపద దొరికితే.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు వద్ద ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ఊహించండి!” అంటూ ఆయన విమర్శించారు.

ఫోన్ ట్యాపింగ్ విచారణ దశలో

ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, త్వరలో జరిగే కేబినెట్ సమావేశం అనంతరం ఈ వ్యవహారంపై కీలక ప్రకటనలు చేయనున్నట్టు చెప్పారు.

సీఎం రేవంత్‌పై ప్రశంసలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించిన కోమటిరెడ్డి.. “రేవంత్ జూనియర్ అయినా సీనియర్ నాయకులను గౌరవిస్తున్నారు. పార్టీ అంతా ఒక టీమ్‌గా పనిచేస్తోంది” అని పేర్కొన్నారు. ఇది సమష్టి నాయకత్వానికి నిదర్శనమని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టును కట్టనివ్వబోమని, శ్రీశైలం ప్రాజెక్టును కాపాడతామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

కవితపై ఘాటు వ్యాఖ్య

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా..
“ఆమె ఎవరో నాకు తెలియదు” అంటూ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/brs-mlas-dharna-gandhi-statue-telangana-assembly/telangana/525884/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్

ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: ప్రతిమా సింగ్

పోలీస్ శాఖ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

పోలీస్ శాఖ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

అంగన్‌వాడీల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం: శృతి ఓజా

అంగన్‌వాడీల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం: శృతి ఓజా

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

35 ఏళ్ల క్రితమే చింతమడకలో ఇఫ్తార్ విందులు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

గచ్చిబౌలి స్టేడియం పునర్నిర్మాణం- సీఎం రేవంత్ ఆదేశం

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

లంచం తీసుకుంటూ దొరికిన సైబర్‌క్రైమ్ ఎస్సైలు

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

ఖమ్మంలో కవిత అరెస్ట్.. జడ్పీ సెంటర్ వద్ద ఉద్రిక్తత

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

అడవిలో ఏఐ నిఘా నేత్రాలు..నిరంతరం గస్తీ

కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

కేసీఆర్, కేటీఆర్‌‌పై నమోదైన కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

తెలంగాణలో వడదెబ్బ మరణాలకు ₹4 లక్షల పరిహారం!

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ని సిద్ధం చేయాలి

📢 For Advertisement Booking: 98481 12870