Banakacharla Project : బనకచర్ల ప్రాజెక్ట్ ఆపాల్సిందే అంటున్న కేసీఆర్

Read Time:  1 min
Banakacharla Project : బనకచర్ల ప్రాజెక్ట్ ఆపాల్సిందే అంటున్న కేసీఆర్
FONT SIZE
GET APP

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)ను తక్షణమే ఆపాల్సిందిగా డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు తెలంగాణ హక్కులకు భంగం కలిగించేలా ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో పోరాటానికి దిగాలని సూచించారు. ఈ విషయంపై హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డిలతో చర్చించి పలు కీలక సూచనలు చేశారు.

పోలవరం తరహాలో దీన్ని నిలువరించాలి

తెలంగాణ రాష్ట్రానికి చెందిన నీటి వాటాలను దెబ్బతీసేలా బనకచర్ల ప్రాజెక్టు నిర్మించబడుతోందని కేసీఆర్ విమర్శించారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి మోదీ, చంద్రబాబు (Modi , Chandrababu) ప్రయోజనాలను కాపాడేందుకు పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదే తరహాలో గతంలో పోలవరం విషయంలో కేంద్రం చూపిన మొండి వైఖరిని గుర్తు చేశారు. ఇప్పుడు అదే స్థాయిలో బనకచర్ల విషయంలో కూడా తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేందుకు ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రాజెక్టుపై స్పందించడంలో తెలంగాణ ప్రభుత్వం అలసత్వం చూపుతోందని కేసీఆర్ విమర్శించారు. వెంటనే కన్నేపల్లి పంపు హౌస్‌ను ఆన్ చేయాలని, రైతులకు అవసరమైన యూరియా కొరతను తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పంట సీజన్ ప్రారంభమైన ఈ సమయంలో ప్రభుత్వ అలసత్వం రైతులకు నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలలో చైతన్యం కలిగించేలా ఉద్యమం జరపాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

Read Also : Priyanka Gandhi : యుద్ధాన్ని ఎందుకు ఆపారు?.. లోక్‌సభలో ప్రశ్నించిన ప్రియాంక గాంధీ

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.