हिन्दी | Epaper

నేడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అత్యవసర భేటీ

sumalatha chinthakayala
నేడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అత్యవసర భేటీ

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. తన ఫామ్ హౌస్ వదిలి తెలంగాణ భవన్ కు రాబోతున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇందులో భాగంగానే ఇవాళ కెసిఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం జరగనుంది. రేపటి నుంచి కేసీఆర్ కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్తూన్నారు.

నేడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్

సమస్యలపై ఎలా పోరాడాలి అనే దాని పైన చర్చ

అటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలు, ఇతర సమస్యలపై ఎలా పోరాడాలి అనే దాని పైన కేసీఆర్ చర్చించబోతున్నారు. ప్రజల వద్దకు మరింత దగ్గర అయ్యేలా కేసీఆర్‌ ప్లాన్ చేస్తున్నారు. ఈ సమావేశంలో పూర్తి అంశాలపై కేసీఆర్ చర్చించబోతున్నారు. ఎమ్మెల్యేలతో పాటు రాజ్యసభ సభ్యులు అలాగే టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఈ సమావేశానికి రానున్నారు.

ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్

మొత్తానికి ఏడాదికి పైగా ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్ తిరిగి యాక్టివ్ అవుతాను అంటున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్కసారి బడ్జెట్ సందర్భంగా కేసీఆర్ సభకు వచ్చారు . ఉన్న కాసేపు ముళ్లమీద కూర్చున్నట్లు కూర్చుని వెళ్లిపోయారు . ఆరునెలలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడుతుందన్న భయంతోనే ఆయన ఆ ఒక్క రోజు కూడా సభకు వచ్చారన్న ప్రచారం జరిగింది .

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870