Kavitha Congress entry : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన వెల్లడించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, కవిత వైపు నుంచి పార్టీలో చేరేందుకు ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు.
అయితే, కవిత చేరికకు తానే స్పష్టంగా వ్యతిరేకిస్తున్నానని (Kavitha Congress entry) ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే అనుభవజ్ఞులు, సమర్థవంతమైన నాయకులు చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. కవిత కంటే మెరుగైన నాయకత్వం తమ పార్టీలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Read Also: Chhattisgarh steel plant blast : స్టీల్ ప్లాంట్లో పేలుడు, ఏడుగురు కార్మికులు సజీవ దహనం!

ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. అయితే, ఈ వ్యవహారంపై కల్వకుంట్ల కవిత నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: