हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News : KA Paul: గ్లోబల్ సమ్మిట్‌పై కే.ఏ. పాల్ తీవ్ర విమర్శలు

Sushmitha
Telugu News : KA Paul: గ్లోబల్ సమ్మిట్‌పై కే.ఏ. పాల్ తీవ్ర విమర్శలు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై (Revanth Reddy) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రం అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు తాను స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి అనేక మార్గాలను సూచించినప్పటికీ, రేవంత్ రెడ్డి వాటిని పెడచెవిన పెట్టి రాష్ట్రాన్ని మరింత భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Read also: TG Summit 2025: తెలంగాణలో భారీ పెట్టుబడుల ప్రకటన

గత రెండేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శిస్తూ, వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిని ఉత్తమ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న తన ఆశలు ఆవిరయ్యాయని, ఆయన రెండేళ్లలోనే అత్యంత చెత్త పాలనను అందించారని కే.ఏ. పాల్ (K.A Paul) ఘాటుగా వ్యాఖ్యానించారు.

KA Paul

హిల్ట్ పథకంపై న్యాయ పోరాటం మరియు అవినీతి ఆరోపణలు

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఇటీవల తెరపైకి వచ్చిన ‘హిల్ట్’ పథకం ముసుగులో 9,300 ఎకరాల భూములను విక్రయించి, దాదాపు రూ.5 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. దీనిపై తాను ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించానని, త్వరలోనే అన్ని ఆధారాలతో ప్రభుత్వంపై మరో 17 కేసులు వేయనున్నట్లు స్పష్టం చేశారు.

తెలంగాణ సొమ్మును ఢిల్లీకి తరలిస్తున్నారని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆరోపిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ పాలనలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, మంత్రులు మాత్రమే బాగుపడ్డారని, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గ్లోబల్ సమిట్‌పై నిప్పులు

ప్రస్తుతం జరుగుతున్న గ్లోబల్ సమిట్‌పై కూడా కేఏ పాల్ తీవ్ర విమర్శలు . ఈ సదస్సు పేరుతో రూ.400 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని, దోచుకునే వారంతా దీనికి హాజరవుతున్నారని మండిపడ్డారు.

200 దేశాల నుంచి ఒక్క దేశాధినేత గానీ, ప్రముఖ పారిశ్రామికవేత్తలు గానీ రావడం లేదని, కేవలం కమీషన్ల కోసమే భూముల ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ సదస్సు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి తన సోదరుడిని ఈ సదస్సుకు ఇన్‌ఛార్జ్‌గా నియమించడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తన తీరు మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని కేఏ పాల్ హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870