हिन्दी | Epaper

బడ్జెట్ పై జీవన్ రెడ్డి ఆగ్రహం

Sudheer
బడ్జెట్ పై జీవన్ రెడ్డి ఆగ్రహం

దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఆ రాష్ట్రానికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ముఖ్యంగా, తెలంగాణకు అన్యాయం చేశారని రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కేంద్ర బడ్జెట్‌పై ఘాటుగా స్పందిస్తూ, ఇది భారత దేశ బడ్జెట్టా, బీహార్ బడ్జెట్టా? అని ప్రశ్నించారు.

జీవన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ప్రధాన ప్రాజెక్టు కూడా కేటాయించకపోవడం దారుణమని విమర్శించారు. కేంద్రంలో మంత్రి పదవిని ఆక్రమించిన కిషన్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధి మీద ఎలాంటి బాధ్యతలేదా? అని నిలదీశారు. తెలంగాణ ప్రజలు ఎన్నో రోజులుగా మెట్రో రైలు విస్తరణ కోసం ఎదురుచూస్తున్నా, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు.

అలాగే, కేంద్ర ప్రభుత్వం ఇటీవల పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించినా, తాజా బడ్జెట్‌లో దానికి సంబంధించిన నిధులు కేటాయించకపోవడం తెలంగాణ రైతులను మోసం చేసినట్టేనని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో పసుపు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నా, వారిని పట్టించుకునే నాధుడు కేంద్రంలో లేడని విమర్శించారు.

ప్రధానంగా, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు రావాల్సిన వాటిని పూర్తిగా దూరం పెట్టి, బీజేపీ పాలిత రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించడం స్పష్టమైన రాజకీయ కుతంత్రమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రజలు బీజేపీ నిజస్వరూపాన్ని గుర్తించి, భవిష్యత్‌లో తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని జీవన్ రెడ్డి సూచించారు.

సమగ్ర అభివృద్ధి అంటూ ప్రచారం చేసుకునే బీజేపీ, తెలంగాణను విస్మరించడం దారుణమని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాష్ట్రంలో నిరసనలు పెరుగుతున్నాయని, తగిన విధంగా ప్రజలు భవిష్యత్తులో తీర్పు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తగ్గిన యూరియా ఉత్పత్తి.. రైతులకు తప్పని తిప్పలు!

తగ్గిన యూరియా ఉత్పత్తి.. రైతులకు తప్పని తిప్పలు!

మార్చి 12న సీఎం చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్!

మార్చి 12న సీఎం చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్!

బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణం

బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణం

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ చార్జీల పెంపు లేనట్టే!

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ చార్జీల పెంపు లేనట్టే!

కామారెడ్డి కేసు మిస్టరీ వీడింది, ముగ్గురు కూతుళ్లను చంపిన తండ్రి

కామారెడ్డి కేసు మిస్టరీ వీడింది, ముగ్గురు కూతుళ్లను చంపిన తండ్రి

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

బీఆర్ఎస్‍తో బీజేపీ పొత్తు పై రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్‍తో బీజేపీ పొత్తు పై రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు

డ్వాక్రా మహిళల హెల్త్ ప్రొఫైలింగ్ కార్యక్రమం షురూ

డ్వాక్రా మహిళల హెల్త్ ప్రొఫైలింగ్ కార్యక్రమం షురూ

ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడేలా చేస్తాం

ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడేలా చేస్తాం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

శాసన మండలి నూతన భవనాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి

శాసన మండలి నూతన భవనాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి

పదో తరగతి పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

పదో తరగతి పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య

📢 For Advertisement Booking: 98481 12870