Ibrahimpatnam Municipal Chairman Election: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. సోమవారం కోరం ఉన్నా ఎన్నిక నిర్వహించకుండా అడ్డుకోవడం, మున్సిపల్ ఆఫీసుపై రాళ్ల దాడి వంటి ఘటనలను తీవ్రంగా పరిగణించింది.
Read Also: Read Also: Medak Municipal Chairman Election: డిల్లీలో లొల్లి.. గల్లీలో దోస్తీ:పద్మాదేవేందర్ రెడ్డి

ఈ నేపథ్యంలో మంగళవారం జరగనున్న ఎన్నిక కోసం ప్రత్యేకంగా అబ్జర్వర్ను నియమించింది.అబ్జర్వర్ సమక్షంలోనే ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని ఆదేశించింది. అధికారుల విధులకు ఆటంకం కలిగించినా, మళ్లీ గొడవలకు దిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అటు పోలీసు యంత్రాంగం కూడా భారీ బందోబస్తును మోహరించింది. ఎస్ఈసీ ప్రత్యక్ష పర్యవేక్షణలో రేపు చైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక సజావుగా సాగుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: