హైదరాబాద్ వాహనదారులకు నేడు అలర్ట్. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సిట్ విచారణకు హాజరవనున్నారు. బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకునే మార్గాల్లో వాహన మళ్లింపులు ఉంటాయని పోలీసులు సూచించారు. ఉదయం 11 గంటల నుంచి అవసరాన్ని బట్టి ట్రాఫిక్ డైవర్షన్లు అమలులో ఉంటాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవడం మంచిదని అధికారులు సూచించారు.
Read also: Phone Tapping Case : నేడు సిట్ విచారణకు హాజరుకానున్న కేసీఆర్

Traffic restrictions on this route today
కేసీఆర్ విచారణ & నేతల చేరిక
కేసీఆర్ ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ నుంచి నందినగర్ ఇంటికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన నివాసానికి చేరతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సిట్ విచారణ ప్రారంభమవుతుంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు సహా కీలక నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్కు సిట్ ఏం ప్రశ్నలు వేస్తుందో, ఆయన ఎలాంటి సమాధానాలు ఇస్తారో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ & భద్రతా చర్యలు
కేసీఆర్ విచారణ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. బీఆర్ఎస్ శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అన్ని జిల్లాల ఎస్పీలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండమని సూచించారు. ముందస్తు బలగాలను మెహరించాలని, బీఆర్ఎస్ శ్రేణులు అదుపుతప్పే ప్రమాదం ఉన్నందున భద్రతా చర్యలను చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్లను సిట్ విచారించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: