హైదరాబాద్ నగరానికి (Hyderabad Aquarium) మరో భారీ ప్రాజెక్టు రానుంది. నగర శివారులోని కొత్వాల్గూడలో సుమారు రూ. 300 కోట్ల వ్యయంతో ప్రపంచస్థాయి టన్నెల్ అక్వేరియం నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే, దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ అక్వేరియంగా నిలవనుంది.
Read Also: Delhi: కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయినా రేవంత్ రెడ్డి

నిర్మాణ భాగస్వాములు మరియు ప్రాజెక్టు వివరాలు
ఈ అక్వేరియంను మల్టీవర్స్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, పొలిన్ అక్వేరియమ్స్, కాడోల్ గ్రూప్ కన్సార్టియం కలిసి నిర్మించనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమి మరియు ఇతర అనుమతులను సమకూర్చనుంది. పొలిన్ అక్వేరియమ్స్ టెక్నికల్ భాగస్వామిగా వ్యవహరించనుండగా, మల్టీవర్స్ హోటల్స్, కాడోల్ గ్రూప్ సంస్థలు ఆతిథ్య, మౌలిక వసతుల విభాగాలను పర్యవేక్షించనున్నాయి. ఈ నిర్మాణం సుమారు 1,75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్ (Hyderabad) సంప్రదాయం ఉట్టిపడేలా ఉండనుంది.
ప్రత్యేక ఆకర్షణలు మరియు లక్షిత జలచరాలు
ఈ అక్వేరియంలో 100 మీటర్ల పొడవైన టన్నెల్తో పాటు, 30 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంతో ట్యాంకులు ఉంటాయి. ఒకేసారి 3 వేల మంది సందర్శకులు వీక్షించేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఈ అక్వేరియంలో 300 జాతులకు చెందిన సుమారు 10 వేల జలచరాలను ప్రదర్శనకు ఉంచుతారు. దీంతో పాటు అండర్ వాటర్ రెస్టారెంట్ వంటి ప్రత్యేక ఆకర్షణలు కూడా ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ టన్నెల్ అక్వేరియం ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: