हिन्दी | Epaper
లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు

Telugu News: HYD: సైకిల్ ట్రాక్ పై అంత్యక్రియలు..విస్తూపోతున్న సైక్లిస్టులు

Sushmitha
Telugu News: HYD: సైకిల్ ట్రాక్ పై అంత్యక్రియలు..విస్తూపోతున్న సైక్లిస్టులు

భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా కొంతమంది వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌కు మణిహారంగా మారిన ఔటర్ రింగ్ రోడ్ (ORR) వద్ద ఉన్న సోలార్ ఆధారిత సైక్లింగ్ ట్రాక్‌పై కొందరు వ్యక్తులు అంత్యక్రియల్లో భాగంగా చేయాల్సిన కొన్ని బాధ్యతలను నిర్వహించడం వివాదాస్పదమైంది. బుధవారం (డిసెంబర్ 10) జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు భగ్గుమంటున్నారు.

Read Also: Revanth Reddy: 13 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

HYD
HYD Funeral on the cycle track…cyclists keep coming

సైక్లిస్టులపై ‘సీఎం తెలుసు’ అంటూ బెదిరింపులు

ఒక వ్యక్తి మరణించినప్పుడు హిందూ సంప్రదాయంలో భాగంగా తలనీలాలు (గుండు కొట్టించడం) అర్పించడం జరుగుతుంది. అయితే, ఈ తలనీలాలను సైక్లింగ్ ట్రాక్‌పై అర్పించడాన్ని సైక్లిస్టులు, నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంత్యక్రియల్లో ఉన్న ఆ కుటుంబానికి సానుభూతి తెలుపుతూనే, పబ్లిక్ సైక్లింగ్ ట్రాక్‌పై ఇలాంటివి చేయడం సరికాదని చెప్పారు.

సైక్లిస్టులు అడ్డుపడినప్పుడు, వారిలో ఒక వ్యక్తి “నాకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలుసు, వారు మా బంధువులు” అంటూ సైక్లిస్టులను బెదిరించే ప్రయత్నం చేశాడు. మరొక వ్యక్తి తాను సర్పంచ్‌ను అని చెప్పుకొచ్చాడు. ఎవరి బబంధువులైనా కావచ్చు, కానీ ఇది అందరి కోసం కట్టిన పబ్లిక్ ట్రాక్ అని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హైదరాబాద్ ప్రతిష్టకు భంగం: చర్యల డిమాండ్

భారత్‌లోనే మొట్టమొదటి సోలార్ ఆధారిత సైక్లింగ్ ట్రాక్ హైదరాబాద్‌లో (Hyd) ఉండటం గర్వకారణమని, కానీ ఇలాంటి చర్యల వల్ల నగర ప్రతిష్ట దెబ్బతింటోందని సైక్లిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. నానక్‌రామ్‌గూడ నుంచి టీఎస్‌పీఏ (TSPA) వరకు 8.5 కిలోమీటర్లు, నార్సింగ్ నుంచి కొల్లూరు వరకు 14.5 కిలోమీటర్లు మేర, సుమారు రూ. 100 కోట్లతో ఈ ట్రాక్‌ను నిర్మించారు. ఈ ట్రాక్ మొత్తం 24 గంటలు తెరిచి ఉంటుంది మరియు సౌరవిద్యుత్‌తో నడుస్తుంది. 16 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 16 వేల సోలార్ ప్యానెల్‌లు ఇక్కడ అమర్చారు.

అంతటి గొప్ప ప్రదేశంలో తలనీలాలు అర్పించడం, ఆ తర్వాత వాటర్ ట్యాంకర్‌ను పిలిపించుకుని స్నానాలు చేయడంపై సైక్లిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు చాలా ప్రాంతాలు ఉండగా, ఇలాంటి పబ్లిక్ ప్లేస్‌లను వినియోగించడంపై నెటిజన్లు తప్పుబట్టారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు ప్రభుత్వాన్ని మరియు సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870