ఉన్నతమైన చదువులు చదివి బంగారు భవితకు బాటలు వేసుకుంటున్న ఆ యువకుడు తన ఆశలు నెర వేరకుండానే మరణించాడు. ఈ సంఘటన లండన్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్ రెడ్డి (26) రెండు సంవత్సరాల క్రితం లండన్ లో పీజీ చేసేందుకు వెళ్లారు. పీజీ పూర్తి చేసుకున్నారు. దీంతో అక్కడే ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అయితే ఇటీవలే మహేందర్ కు వర్క్ వీసా కూడా వచ్చింది.
Read Also: Jubilee Hills election: పొన్నం ప్రభాకర్పై అంజన్ కుమార్ ఆగ్రహం
అయితే ఇంతలోనే అతనికి హఠాత్తుగా గుండెపోటు వచ్చి మరణించారు. దీంతో మహేందర్ రెడ్డి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఉన్నతమైన చదువులు చదివి, తమను ఉద్దరిస్తాడని అనుకుంటే, తమ కళ్లముందే తమ కుమారుడు మరణవార్తను వినాల్సి వస్తుందని మహేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తండ్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
మహేందర్ రెడ్డి తండ్రి కాంగ్రెస్ పార్టీ(Congress Party) మేడిపల్లి మండల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ విషాదకర ఘటనతో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
లండన్లో గుండెపోటుతో మృతి చెందిన విద్యార్థి ఎవరు?
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్ రెడ్డి (26).
మహేందర్ రెడ్డి లండన్కి ఎందుకు వెళ్లాడు?
పీజీ చదువుల కోసం రెండు సంవత్సరాల క్రితం లండన్ వెళ్లాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: