Harish Rao criticism : 2047కి పిల్లల భవిష్యత్తే ప్రమాదమంటున్న హరీశ్ రావు వ్యాఖ్యలు!…

Read Time:  1 min
Harish Rao criticism
Harish Rao criticism
FONT SIZE
GET APP

Harish Rao criticism : సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు.
రెండు సంవత్సరాల్లో 116 మంది విద్యార్థులు కలుషిత ఆహారంతో ఆసుపత్రులు పాలయ్యారని, ఇది “విజన్ 2047 కాదు… పిల్లలకు పాయిజన్ 2047” అని వ్యాఖ్యానించారు.

బాగ్ లింగంపల్లి మైనారిటీ గురుకులంలో కలుషిత (Harish Rao criticism) భోజనం చేసుకున్న 90 మంది విద్యార్థులను పరామర్శించిన తర్వాత హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

ఆయన మాట్లాడుతూ—

  • “ప్రతి రోజూ ఏదో ఒక గురుకులంలో విద్యార్థులు విషపూరిత ఆహారం తిని పడిపోతున్నారు.”
  • “షామీర్‌పేట BC గురుకులంలో అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు పోలీస్ స్టేషన్ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.”
  • “ఇప్పుడు మాదాపూర్, ముషీరాబాద్‌లో 40 నుండి 90 మంది వరకు పిల్లలు ఆసుపత్రిలో పడుతున్నారు.”

Read also: Actress Vahini: క్యాన్సర్ తో బాధపడుతున్న నటి వాహిని

రేవంత్ రెడ్డి వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ—
“పిల్లలు ఆసుపత్రుల్లో ఉండగా, ముఖ్యమంత్రి మాత్రం ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో బిజీగా ఉన్నాడు. స్టేడియాల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నాడు కానీ హాస్టల్ పిల్లలకు పూటకి పూట భోజనం పెట్టే బాధ్యత మాత్రం లేదు” అని తీవ్రంగా విమర్శించారు.

రాహుల్ గాంధీపై కూడా హరీశ్ రావు వ్యాఖ్యలు చేశారు:

  • “రాష్ట్రంలో రైతులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు చనిపోతే రారు… కానీ ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికి ప్రత్యేక విమానంలో వస్తున్నారు. గురుకులాల్లో పురుగులన్నం తిన్న పిల్లల పరిస్థితి చూడడానికి మాత్రం సమయం లేదు” అన్నారు.

మొత్తం రాష్ట్రంలో కలుషిత భోజనం సమస్య పెరుగుతున్నా, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు.
“త్రీ ట్రిలియన్ ఎకానమీ, ఫ్యూచర్ సిటీ అన్నవి పక్కన పెడితే… ముందు హాస్టళ్లలో పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టాలి” అని ఆయన హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.