हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Group 1 : గ్రూప్-1 ఫలితాల్లో వారికి అన్యాయం – కవిత

Sudheer
Group 1 : గ్రూప్-1 ఫలితాల్లో వారికి అన్యాయం – కవిత

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టిజిపిఎస్సీ (TGPSC) గ్రూప్-1 ఫలితాలపై అభ్యర్థుల లేవనెత్తుతున్న సందేహాలను నివృత్తి చేయాలని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆమెను కలిసి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గ్రూప్-1 ఫలితాల ప్రకటనలో సమర్థతపై అభ్యర్థుల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు.

తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం?

పరీక్ష పత్రాల మూల్యాంకనంలో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగినట్లు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు కవిత వెల్లడించారు. ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపి, అన్యాయం జరిగితే బాధితులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అన్ని మీడియా విద్యార్థులకు సమానమైన అవకాశాలు కల్పించేలా పద్ధతులను రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు.

కాంగ్రెస్ హామీల అమలుకు కవిత పోస్ట్‌కార్డు ఉద్యమం

గ్రూప్-2 ఫలితాల్లో నిర్ధారణ లేమి

కేవలం గ్రూప్-1 ఫలితాలే కాకుండా, ఇటీవల ప్రకటించిన గ్రూప్-2 ఫలితాల విషయంలో కూడా అభ్యర్థుల ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రత్యేకంగా, 13 వేల మందిని ‘ఇన్వాలిడ్’గా ప్రకటించడం వెనుక కారణాలు స్పష్టంగా తెలియజేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్షా ప్రక్రియలో పారదర్శకత లేకుంటే, లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

న్యాయం కోసం విద్యార్థుల పోరాటం

గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలపై అభ్యర్థుల అనుమానాలను ప్రభుత్వమే నివృత్తి చేయాలని, లేకపోతే విద్యార్థి సంఘాలు తీవ్ర పోరాటానికి దిగుతాయని కవిత హెచ్చరించారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోవాల్సిన అవసరం ఉందని, పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత చాలా కీలకమని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అధికారులు, టిజిపిఎస్సీ అధికారులు దీనిపై సమగ్ర నివేదిక ఇచ్చి, అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870