हिन्दी | Epaper

HCU : కంచ గచ్చిబౌలి భూమి వివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Sudheer
HCU : కంచ గచ్చిబౌలి భూమి వివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో కలకలం రేపుతున్న రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సుప్రీంకోర్టు మధ్యలోకి రావడంతో, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ అంశాన్ని పరిష్కరించేందుకు కీలక చర్యలు చేపట్టింది. భూమి వ్యవహారంపై స్పష్టత తీసుకురావడానికి మంత్రులతో కూడిన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.

హెచ్సీయూ అధికారులతో సంప్రదింపులు జరగనున్న కమిటీ

ఈ త్రిసభ్య కమిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) అధికారులు, విద్యార్థులు, ప్రజా సంఘాలతో సమావేశమవుతూ వారి అభిప్రాయాలు తెలుసుకోనుంది. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టత ఇవ్వడమే కాకుండా, ఎవరికీ అభ్యంతరాలు లేకుండా వివాదాన్ని పరిష్కరించడమే లక్ష్యంగా సర్కార్ ముందడుగు వేసింది. ప్రజా సంఘాల ఆందోళనలు, విద్యార్థుల నిరసనలు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ సంప్రదింపుల మార్గాన్ని ఎంచుకుంది.

Hyderabad: హెచ్‌సీయూ భూవివాదంపై మంత్రుల కమిటీ ఏర్పాటు



విద్యార్థులు, పర్యావరణవేత్తల అభ్యంతరాలు

విద్యార్థులు, పర్యావరణవేత్తలు ఈ భూమిని గతంలో హెచ్సీయూకి కేటాయించారని ఆరోపిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టం చేస్తోంది. టెక్ సిటీగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రైవేట్ సంస్థలకు భూములు కేటాయించేందుకు చర్యలు చేపడుతోంది. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూమి వివాదం రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపుతోంది.

కోర్టుల ఆదేశాలతో సర్కార్ ఒత్తిడిలో

ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ వివాదంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, చెట్ల నరికి వేయడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ప్రభుత్వం చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటుందని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అఫిడవిట్ కోరుతూ తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసింది. హైకోర్టు రిజిస్ట్రార్‌ను భూముల పరిశీలనకు ఆదేశించడంతో ఈ వ్యవహారం మరింత సీరియస్‌గా మారింది. ఈ భూమి వ్యవహారం అభివృద్ధి పేరుతో ప్రకృతికి హాని చేస్తోందా? లేక వాస్తవంగానే ప్రజలకు మేలుకలిగించే ప్రాజెక్ట్ అనేది త్వరలో స్పష్టమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

📢 For Advertisement Booking: 98481 12870