हिन्दी | Epaper

General strike: 9న సార్వత్రిక సమ్మెలో బ్యాంక్, బీమా ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలి

Sharanya
General strike: 9న సార్వత్రిక సమ్మెలో బ్యాంక్, బీమా ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలి

సైఫాబాద్ (హైదరాబాద్): కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతోపాటు 4 కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల(Trade Unions), ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యం లో ఈ నెల 9వ జరిగే దేశవ్యాప్త సమ్మెలో (General strike) బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవం తం చేయాలని ఎఐబిఇఎ జాతీయ కార్యదర్శి బి.ఎస్. రాంబాబు పిలుపునిచ్చారు. సార్వత్రిక సమ్మె (General strike) సన్నద్ధంలో భాగంగా శుక్రవారం ఎఐబిఇఎ రాష్ట్ర కార్యాలయంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ పబ్లిక్ సెక్టార్ యూనియన్స్ (యుఎఫ్సియు) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం (Round table meeting) లో ఆయన ప్రసంగించారు.

General strike: 9న సార్వత్రిక సమ్మెలో బ్యాంక్, బీమా ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలి
General strike: 9న సార్వత్రిక సమ్మెలో బ్యాంక్, బీమా ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలి

సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి

ఈ సమావేశానికి పబ్లిక్ సెక్టార్ యూనియన్స్ కో-ఆర్డినేటర్ వి. ఎస్.బోస్ అధ్యక్షత వహించగా, రౌండ్ టేబుల్ సమావే శంలో యుఎఫ్పియు కన్వీనర్ ఎన్.వి.రమణ, ఎఐపిఆర్ డిఎ రాష్ట్ర కార్యదర్శి ఎం.డి. జలాలుద్దీన్, ఎం. శివశంకర్ (జిఐజిఎఐఎ, తెలంగాణ), పి.అజయ్కుమార్, పి.ఉదయ్ భాస్కర్ (డిజిఎస్-ఎపిటిబిఇఎఫ్), ఎఐబిఒఇ అధ్యక్షుడు పిఎసిపిఆర్ పణికుమార్, జిఐఇఎఐఎ ఆర్గనైజింగ్ సెక్రటరీ సి. కిషన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బి.ఎస్. రాంబాబు మాట్లాడుతూ నూతన ఆర్థిక విధానాల పేరుతో కేంద్ర ప్రభుత్వం తిరగమన పోకడలను అనుసరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల ను ప్రైవేటు పరం చేసేందుకు నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. వి.ఎస్. బోస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ రంగానికి అనేక రాయితీలు ఇస్తూ, కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని ఆరోపిం చారు. 9వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెలో దేశవ్యాప్తంగా 25 కోట్లమంది సంఘటిత, అసంఘిటిత కార్మికులు, రైతులు, బ్యాంకింగ్, బీమారంగ ఉద్యోగులు పాల్గొంటున్నారని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Govt Schools : తెలంగాణ లో కొత్తగా 157 సర్కారీ బడులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులను సాధించాలి

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులను సాధించాలి

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

📢 For Advertisement Booking: 98481 12870