Forest Department : పులులకు విషం పెట్టి చంపొద్దు.. అది నేరం

Read Time:  1 min
Forest Department : పులులకు విషం పెట్టి చంపొద్దు.. అది నేరం
FONT SIZE
GET APP

హైదరాబాద్ : నగరం చుట్టూ అటవీ ప్రాoతం అంతరించడంతో పులులు బయటకు వస్తున్నాయని అటవీశాఖ ముఖ్య కార్యదర్శి సువర్ణ అన్నారు. గురువారంఆమె అరణ్యభవన్లో మీడియా ప్రతినిధులతో సవవేశమ య్యారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ… పులి కంటే చిరుతపులి తెలువైంది. చిరుత ఒఆర్ఆర్ (ORR) రెండుసార్లు దాటింది. ఇప్పటి వరకు ఎవరిపైనా దాడి చేయలేదు ఆ తర్వాత అది ఫారెస్ట్లోకి వెళ్ళిందన్నారు. నగరం చుట్టూ పక్కల ఆటవీ ప్రాంతం అంతరించడం, వాటికి అడవిలో (Forest) సరైన ఆహారం దొరక్కపోతే బయటకి వస్తున్నట్లు తెలిపారు. జంతువులు, మానవులపై ఎక్కువ దాడి చేసే అవకాశం ఉందన్న ఆమె నగరంలో చిక్కిన మగ చిరుత 5నుండి 6 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఈ ఒక్క చిరుతకే ఇంత సమయం పట్టిందన్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అవి ఇంకా తిరుగుతు న్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మూడు వారాల తర్వాత ఈరోజు మంచిరేవులలో చిరుత చిక్కిందన్నారు.

Forest Department

క్రూర మృగాల దాడిలో మనుషులు చనిపోతే పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నాం. కానీ విషం పెట్టీ వీటిని చంపొద్దు. చంపితే అటవీ చట్టం కేసులు నమోదు అవుతాయని ఆమె హెచ్చరించారు. పులుల సమాచారం ఉంటే టోల్డ్ 040 232317725 సమాచారం ఇవ్వాలని ఈ ఆమె ఈ సందర్భంగా విజప్తి చేశారు. ఫారెస్టు సీనయర్ ఆఫీసర్ శంకరన్ మాట్లాడుతూ.. చిరుత పులుల సంచారం పెరుగు తుంది కాని, పులుల సంతానం పెరగలే దన్నారు. మహారాష్ట్ర నుంచి ఎక్కువగా వస్తున్నాయని, మహబూబ్ నగర్ లో రెండు చోట్ల చిరుత పులులు సంచరిస్తూ మను షుల మీద దాడులు చేస్తున్నాయన్నారు. చిలు కూరు ప్రాంతంలో ఉన్న చిరుతను పట్టుకు న్నామని, గతంలో ఒక చిరుతను పట్టుకో వాలాం టే మూడు నెలలు పట్టింది చిలుకూరు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా సునా యసంగా చిరుతను పట్టుకున్నమని, ఇందుకు వాకర్స్ కూడా ఎంతో సహకరించినట్ల ఆమె తెలిపారు.

READ MORE :

https://vaartha.com/state-rules-regulations-focus-on-accounting-billing-subsidy/telangana/524222/

Shravan

రచయిత గురించి

Shravan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.