Breaking News – Fake Bills : ఖమ్మం మార్కెట్లో దొంగ చెస్ బిల్లుల కలకలం

Read Time:  1 min
Breaking News – Fake Bills : ఖమ్మం మార్కెట్లో దొంగ చెస్ బిల్లుల కలకలం
FONT SIZE
GET APP

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌(Khammam Agricultural Market)లో నకిలీ చెస్ బిల్లులు బయటపడటంతో రైతులు, వ్యాపారులు కలవరపడ్డారు. పత్తి వ్యాపారం చేస్తున్న ఓ ట్రేడర్, మరో వ్యాపారి చెస్ పుస్తకాలను దొంగిలించి వాటిని నకిలీగా ముద్రించినట్టు సమాచారం. ఈ నకిలీ బిల్లుల ఆధారంగా పెద్ద ఎత్తున లావాదేవీలు జరగడం మార్కెట్‌లో సంచలనం సృష్టించింది.

గుంటూరులో పెద్ద ఎత్తున విక్రయాలు

నకిలీ బిల్లులను ఉపయోగించి, గుంటూరులోని ఒక ప్రముఖ సంస్థకు భారీ మొత్తంలో పత్తిని విక్రయించినట్టు తెలుస్తోంది. అయితే బిల్లులలోని వివరాలు సరిపోకపోవడంతో అధికారులు పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రైతులు, నిజాయితీగా వ్యవహరించే వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విచారణలో అధికారులు

ఈ ఘటనపై మార్కెట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ బిల్లులు ఎలా ముద్రించబడ్డాయి? వాటి వెనుక ఉన్న ముఠా ఎవరు? అన్న దానిపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోంది. నిజాయితీతో వ్యాపారం చేస్తున్న రైతులకు ఇలాంటి మోసాలు నష్టం కలిగిస్తున్నాయని, తప్పిదస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు.

https://vaartha.com/telugu-news-today-gold-rates-festival-time-even-if-gold-decreases/today-gold-rate/534893/

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.