हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Fake Call: అమెరికాలో ఉన్న కొడుకు పేరుతో ఫేక్ కాల్: షాక్‌తో తండ్రికి ప్రాణాపాయం

Pooja
Fake Call: అమెరికాలో ఉన్న కొడుకు పేరుతో ఫేక్ కాల్: షాక్‌తో తండ్రికి ప్రాణాపాయం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో చోటుచేసుకున్న ఒక ఫేక్ కాల్(Fake Call) ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. అమెరికాలో చదువుకుంటున్న కుమారుడి పేరుతో సైబర్ నేరగాళ్లు(Cyber ​​criminals) చేసిన మోసపు కాల్ తండ్రి ప్రాణాన్ని తీసేంత భయాన్ని కలిగించింది.

Read Also: Janasena Party: జనసేన ఎక్స్ అకౌంట్‌ హ్యాక్

Fake Call
Fake Call

కుమారుడి పేరుతో నేరగాళ్ల మోసం

హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన మాసాడి లక్ష్మణరావు కుమారుడు గత మూడేళ్లుగా అమెరికాలో విద్యనభ్యసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు లక్ష్మణరావుకు ఫోన్(Fake Call) చేసి “మీ కుమారుడు నేరం చేశాడు, ప్రస్తుతం మా కస్టడీలో ఉన్నాడు. కేసును మాఫీ చేయాలంటే వెంటనే రూ.9 లక్షలు జమ చేయాలి” అంటూ బెదిరించారు. తర్వాత మళ్లీ కాల్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ క్లోనింగ్ సాయంతో కుమారుడి గొంతుతో మాట్లాడించారు. “నాన్నా, నన్ను కాపాడు… వీళ్లు నన్ను చంపేస్తారు” అంటూ కేకలు వినిపించడంతో లక్ష్మణరావు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.

భయంతో కిందపడిన తండ్రి

భయంతో వెంటనే హుజూరాబాద్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి విషయం వివరించడానికి ప్రయత్నించిన లక్ష్మణరావు, అకస్మాత్తుగా బీపీ పెరగడంతో కిందపడిపోయాడు. పోలీసులు వెంటనే అతన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

పోలీసుల హెచ్చరిక

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఐ యునస్ మాట్లాడుతూ, “పోలీస్, సీబీఐ, బ్యాంక్ అధికారి పేరుతో వచ్చే కాల్స్‌కి ఎవరూ నమ్మకండి. ఇలాంటి కాల్స్‌కి గురైతే వెంటనే పోలీసులను సమాచారం ఇవ్వండి” అని ప్రజలను అప్రమత్తం చేశారు. ఇటీవల ఇటువంటి ఫేక్ కాల్స్ మరియు AI వాయిస్ క్లోనింగ్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870