हिन्दी | Epaper

Fake baba fraud case : లంకె బిందెల పేరిట టోకరా, దొంగ బాబా అరెస్ట్, లక్షలు మాయం!

Sai Kiran
Fake baba fraud case : లంకె బిందెల పేరిట టోకరా, దొంగ బాబా అరెస్ట్, లక్షలు మాయం!

Fake baba fraud case : మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని ప్రజలను మోసం చేస్తున్న ఓ దొంగ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. లంకె బిందెలు ఉన్నాయంటూ భయపెట్టి లక్షల్లో డబ్బులు దోచుకున్న ఈ మోసగాడి గుట్టును కామారెడ్డి పోలీసులు రట్టు చేశారు.

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోన్నాజీపేటకు చెందిన దుమ్మల్ల బీరవ్వ ఇంటికి కొద్ది రోజుల క్రితం వాస్తు, అతీంద్రియ శక్తులు ఉన్నట్లు చెప్పుకుంటూ ఓ వ్యక్తి వచ్చాడు. ఇంట్లో ‘లంకె బిందెలు’ ఉన్నాయని, వాటి వల్ల అనారోగ్యం, కుటుంబ సమస్యలు వస్తున్నాయని భయపెట్టాడు. క్షుద్ర పూజలు చేసి సమస్య తొలగిస్తానంటూ రూ.8.20 లక్షలు డిమాండ్ చేశాడు. బాధితులు నమ్మి డబ్బులు ఇచ్చిన తర్వాత అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మోసం బయటపడింది.

Read also: Recruitment 2026: ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. అప్లై చేయడానికి రేపే లాస్ట్ డేట్ 

Fake baba fraud case
Fake baba fraud case

ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టి సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన కడమంచి నర్సింలు అలియాస్ నర్సిరెడ్డిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.7 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు, రెండు లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు సహచరుల కోసం గాలింపు కొనసాగుతోంది.

పోలీసుల దర్యాప్తులో నిందితుడు ఇలాంటి మోసాలకు ముఠా ఏర్పాటు చేసి గుప్తనిధులు, క్షుద్ర పూజల పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలింది. గతంలో కూడా పలువురిని ఇదే తరహాలో మోసం చేసిన కేసులు నమోదయ్యాయి. మూఢనమ్మకాలపై నమ్మకం పెట్టుకోకుండా, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870