हिन्दी | Epaper

Telugu News: Etela Rajender: నా మాటలు అవాస్తవమైతే రాజకీయల నుంచి తప్పుకుంటా..

Sushmitha
Telugu News: Etela Rajender: నా మాటలు అవాస్తవమైతే రాజకీయల నుంచి తప్పుకుంటా..

బీసీ రిజర్వేషన్ల ((BC Reservations) )విషయంలో తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలితే, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) సవాల్ విసిరారు. బీసీ బంద్‌లో భాగంగా జూబ్లీ బస్టేషన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయడం సాధ్యం కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారని ఈటల గుర్తుచేశారు. వాస్తవాలు తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు.

Read Also: Savita: విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోండి

బీసీ జనాభా లెక్కలు తప్పులతడక

ప్రభుత్వం చెబుతున్న బీసీ జనాభా లెక్కలు పూర్తిగా తప్పులతడక అని ఈటల విమర్శించారు. 52 శాతం ఉన్న బీసీలను 42 శాతంగా చూపడం కేవలం కాకి లెక్కలు చెప్పడమేనని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం నామమాత్రంగా కమిషన్లు వేస్తోందే తప్ప, వాటిని అమలు చేయడంలో నిజాయతీ చూపడం లేదని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా బీసీల విషయంలో ఇలాగే వ్యవహరించిందని, కేసీఆర్ హయాంలో సర్వేలు చేసి, కమిషన్లు వేసినా చిత్తశుద్ధి లేకపోవడం వల్లే బీసీలకు న్యాయం జరగలేదని ఈటల విమర్శించారు.

Etela Rajender
Etela Rajender

తమిళనాడు విధానాన్ని అనుసరించాలి: ఈటల డిమాండ్

తమిళనాడులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్లపాటు సమగ్ర సర్వే జరిపి, ఆ నివేదికను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చడం వల్లే అక్కడ రిజర్వేషన్లు పక్కాగా అమలవుతున్నాయని ఈటల గుర్తుచేశారు. తెలంగాణలో కూడా అదే విధానాన్ని పాటించాలని ఆయన డిమాండ్ చేశారు.

బీజేపీ పాలన, బీసీల భవిష్యత్తు

తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) హామీ ఇచ్చారని, ఆయన కేబినెట్‌లో 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారని ఈటల గుర్తుచేశారు. మాదిగ రిజర్వేషన్ల విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఘనత కూడా బీజేపీ ప్రభుత్వానిదేనని తెలిపారు. “బీసీలు యాచించే స్థాయిలో లేరు, శాసించే స్థాయికి ఎదగాలి. ప్రాంతీయ పార్టీలతో ఆ కుటుంబాలకే అధికారం దక్కుతుంది తప్ప బీసీలకు మేలు జరగదు” అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

తన ఆరోపణలు అవాస్తవమని తేలితే ఈటల రాజేందర్ ఏమి చేస్తానని సవాల్ విసిరారు?

రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు.

తెలంగాణ ప్రభుత్వం బీసీ జనాభా లెక్కలను ఎలా చూపిస్తోందని ఈటల విమర్శించారు? 52 శాతం ఉన్న బీసీలను 42 శాతంగా చూపడం ద్వారా కాకి లెక్కలు చెబుతోందని విమర్శించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870