हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాలి- ఎఐసిసి ఇన్చార్జి మీనాక్షి నటరాజన్

Sharanya
Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాలి- ఎఐసిసి ఇన్చార్జి మీనాక్షి నటరాజన్

హైదరాబాద్: పంచాయతీ సంఘటన్ స్థానికసంస్థల ఎన్నికల్లో (Elections) పనిచేయాలని మీనాక్షి నటరాజన్ కోరారు. రాష్ట్ర రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన్ సమావేశం చైర్మన్ రాచమల్ల సిద్దేశ్వర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం లో ఎఐసిసి ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, సంఘటన్ జాతీయ అధ్యక్షలు సునీల్ పన్వర్ తది తరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

ఎన్నికలలో సంఘటన్ కీలక బాధ్యతలు తీసుకోవాలి:

ఈ సమావేశంలో మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సంఘటన్ కీలక బాధ్యతలు తీస్కొని పని చేయాలని సూచించారు. గ్రామ పునాది నుంచి పార్టీని బలోపేతం చేయడానికి బూత్లవల్ కార్యకర్తల సహకారం తీసుకోవాలని ఆమె కోరారు. కాంగ్రెస్ పార్టీ లౌకికతత్వాన్ని ప్రజలకు వివరించి వారి అభిప్రాయాలు కాంగ్రెస్ (Congress) భావాజాలంకు అనుకూలంగా కూడగట్టుకోవడానికి పంచాయతీసంఘటన్ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని దేశంలో జరుగుతున్న వివిధ రాజకీయ పరిణామాలను వారికి తెలిపి ఈ పరిస్థితిలో రాహుల్గాంధీ నాయకత్వం బలోపేతం చేస్తేనే అన్ని రకాల రుగ్మతలకు పరిష్కారం లభిస్తుందనే సంకేతం ప్రజలకు బలంగా పంపిం చాలని ఆమె కోరారు. సునీల్ పన్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంఘటన్ పునర్ వ్యవస్తేకరణ చేస్తామని అన్నారు. మీనాక్షి నటరాజన్తో మల్లు రవి ఆదివారం గాంధీభవన్లో భేటీ అయ్యారు. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని నిర్వహించాలని మీనాక్షి నట రాజన్ సూచించారు. పలు నియోజక వర్గాల్లో క్రమశిక్షణ అంశాలకు సంబంధించిన ఫిర్యాదులపై మీనాక్షితో మల్లు రవి చర్చించారు.

సినిమా డైలాగులు రాజకీయాల్లో చెల్లుబాటు కాదు: ఎంపి మల్లు రవి

సినిమా డైలాగులు రాజకీయాల్లో చెల్లుబాటు కావని పార్లమెంట్ సభ్యులు మల్లురవి అన్నారు. రాజుల కాలంలో రప్పా రప్పా ఆడించేది ఉండేదని అన్నారు. ఇప్పుడు ఉన్నది. ప్రజాస్వామ్యమని ఇక్కడ రప్పా రప్పా అంటే చెల్లదని మల్లు రవి వార్నింగ్ ఇచ్చారు. వ్యక్తిగత కక్షలకు ప్రజాస్వామ్యంలో తావు లేదని అన్నారు. బిఆర్ఎస్ నేతలను హెచ్చరిస్తూ ఈ డైలాగులు వినడానికి బాగుంటాయని కానీ రాజకీయాల్లో చెల్లవని హెచ్చరించారు. బిఆర్ఎస్ పరిస్థితి లోకల్ బాడీ ఎన్నికల్లో తేలుతుందని మల్లు రవి చెప్పారు. బిఆర్ఎస్ వంటి పార్టీలకు కాంగ్రెస్ భయపడదని హెచ్చరించారు. వరంగల్ జిల్లాకు సంబంధించిన అంశం తన దృష్టికి వచ్చిందని అన్నారు. టీ కాంగ్రెస్ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను అడిగి సమస్య తెలుసుకుంటానని చెప్పారు. ఆ సమస్యలను తెలుసుకొని పార్టీ లైన్ ప్రకారం ముందుకు వెళ్తానని తెలిపారు. వరంగల్, గజ్వేల్ రెండు ప్రాంతాల నుంచి హై కమాండ్కి ఫిర్యాదులు వచ్చాయనివాటిపై పరిశీలన చేస్తామని మల్లు రవి పేర్కొన్నారు.

Read also: Ponguleti Srinivasa Reddy: ప్రతి పేదోడికి ఇల్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870