డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్తిక్ చైతన్య
హైదరాబాద్ : గంజాయి , డ్రగ్స్ తనిఖీలకు వెళ్లినపుడు ప్రత్యక్షంగా పట్టు కోవడంతోపాటు సింథటిక్ డ్రగ్స్, ఆల్ఫోజోలం, కెమికల్స్ న్ను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ టీమ్లు తనిఖీలు నిర్వహించినపుడు చాల విషయాలను గుర్తుకు పెట్టుకోవాలని ఎక్స్ ఫర్ట్, డ్రగ్ ఇన్స్పెక్టర్ సి.హెచ్. కార్తిక్ చైతన్య (Drug Inspector Karthik Chaitanya) అన్నారు.
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఎక్సైజ్ శాఖ స్టేట్ టాస్క్ఫోర్స్ (Excise Department State Task Force) టీమ్లతోపాటు ఎన్ఫోర్స్ మెంట్, ఎస్ టి ఎఫ్, డిటిఎఫ్ టీమ్ కు కెమికల్స్ ను ఎలా గుర్తించడం అనే విషయంపై అవగహన సమావేశాన్ని నిర్వహించారు.ఆదివారం నాచారం, చర్లపల్లి ప్రాంతాల్లో డ్రగ్స్ తయారీకి వినియోగించే మెపెడ్రెను పట్టుకున్నారు.
తనిఖీలకు టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్శాఖ
అదే విధంగా ఒక పాఠశాలలో ఆల్ఫోజోలం తయారీ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటువంటి సమయాల్లో తనిఖీలకు టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్శాఖ (Task Force Excise Department) వెళ్లినప్పుడు యంత్రాంగం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని పవర్ ప్రజెంటేషన్ ద్వారా విరవరించారు.తనిఖీల్లో ప్రధానంగా ఎక్సైజ్ శాఖ టీమ్లు వెళ్లినపుడు పెంటనీల్, ఆల్ఫోజలం,

డ్రగ్స్ మెపెడ్రోన్ సిం థటిక్ డ్రగ్స్ తయారీపై యూనిట్ల వద్దకు వెళ్లినపుడు ముందు కమికల్స్ మిలితం కోసం తయారుచేసిన లేదా రాసిన నోటన్ను, మ్యాపులను, అక్కడ ఉన్న కెమికల్స్ ను, తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకోవాలన్నారు.
ఏ రకమైన డ్రగ్స్ తయారీ చేస్తున్నాడనే విషయం
అనంతరం సంబంధిత నిందితులు ఏ రకమైన డ్రగ్స్ తయారీ చేస్తున్నాడనే విషయం కోసం స్థానికంగా ఉన్న కెమికల్స్ (Chemicals) వివరాలను గుగూల్ (Google) లో పబ్ చామ్, ఎంఎస్ఎస్ లాంటి గుగూల్లో సైట్లలో సమాచారం పక్కా విషయాన్ని తెలుసు కునే అవకాశం ఉంటుందన్నారు. ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే కేసులను బాగా చేయడంతో పాటు నిందితులను పట్టుకోవచ్చున్నారు.
ఈ సమావేశంలో ముఖ్యఅథితిగా అడిషనల్ కమి షనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, అసిస్టెంట్ కమి షనర్లు ప్రణవీ, అనిల్ కుమార్రెడ్డి, ఆర్.కిషన్, జి .శ్రీనివాసరెడ్డి, అడిషనర్ ఎస్పీ వెంకటేశ్వర బాబు, ఎస్ టి ఎఫ్ డీఎస్పీలు తుల శ్రీనివాసరావు, తిరుపతి యాదవ్, ఈఎస్లు ప్రదీర్రావు, నవీన్, ఉజ్వలరెడ్డిలు పాల్గన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: