తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఇటీవల విలేకరులతో చిట్చాట్లో పలు కీలక విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన పాలన అందిస్తుందని, అందుకే ప్రజలు తమను మళ్లీ ఆదరిస్తారని రేవంత్ రెడ్డి ధీమాగా చెప్పారు. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్ చేతుల్లోనే సురక్షితంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
కేసీఆర్ పై విమర్శలు
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)పై రేవంత్ రెడ్డి కొన్ని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. “కేసీఆర్ తనకు తానే బందీ అయ్యారు” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చర్లపల్లి జైలుకు, ఫామ్హౌస్కు ఏమైనా తేడా ఉందా? అంటూ ప్రశ్నిస్తూ కేసీఆర్ ప్రస్తుతం ఇంటికే పరిమితం కావడంపై పరోక్షంగా సెటైర్లు వేశారు. అయితే, కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.
రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ
జుబ్లీహిల్స్ ఉపఎన్నికల గురించి మాట్లాడుతూ, బీహార్తో పాటు జూబ్లీహిల్స్ బైపోల్ కూడా వచ్చే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఉపఎన్నికకు సంబంధించిన అభ్యర్థిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సరైన సమయంలో పార్టీ అధిష్టానం దీనిపై ఒక నిర్ణయానికి వస్తుందని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.
Read Also : Sangeetha: విడాకుల వార్తపై స్పందించిన సినీ నటి సంగీత