హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లుతున్నారు. ఇందుకు సంబంధించి ఆయన షెడ్యూల్ ఖరారు అయినట్టు సమాచారం. గత నెల 26న సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిశారు. తాజా ఆయన మళ్లీ ఢిల్లీకి వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. ప్రధాని మోడీతో జరిగిన చర్చల్లో భాగంగానే మళ్లీ ఢిల్లీకి వెళ్తున్నారా? అనే చర్చ జరుగుతున్నది. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నది.

కేంద్ర మంత్రులను, పార్టీ పెద్దలను కలిసే అవకాశం
ముఖ్యంగా కేంద్రం గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో భేటీ కానున్నట్టు తెలిసింది. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది 37వసారి కావడం గమనార్హం. కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపై పార్టి నేతలతో చర్చించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఇక అటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్లపై కీలక ప్రకటన వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక తొలి విడతలో 71, 482 ఇందిరమ్మ ఇండ్లు
ఈనెల 15వ తేదీ లోపు అకౌంట్లోకి డబ్బులు కూడా రాబోతున్నాయట. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఊపందుకుంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక తొలి విడతలో 71, 482 ఇందిరమ్మ ఇండ్లకు గ్రీన్ సిగ్నల్ లభించిన సంగతి తెలిసిందే. దాదాపు 700 మంది నిర్మాణం కూడా ప్రారంభించారని లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణ అభివృద్ధి దిశగా సీఎం రేవంత్ రెడ్డి చురుకుగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర హక్కుల కోసం కేంద్రాన్ని ఒప్పించే దిశగా మరింత కృషి చేయాలని ఆయన భావిస్తున్నారు.