हिन्दी | Epaper
రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు

Telugu News: CM Revanth: నర్సంపేటకు ముఖ్యమంత్రి రేవంత్ వరాల జల్లు

Sushmitha
Telugu News: CM Revanth: నర్సంపేటకు ముఖ్యమంత్రి రేవంత్ వరాల జల్లు

ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నర్సంపేటలో నిర్వహించిన సభ విజయవంతంగా ముగిసింది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంచనాలకు మించి హాజరయ్యారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి (MLA Donthi Madhav Reddy) అధ్యక్ష ఉపన్యాసం చేసిన అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు పోతున్నామని, అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం దూసుకుపోతుందని, నిస్వార్థంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరవేస్తున్నామని ఆయన అన్నారు.

Read Also: CM Revanth: నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్

CM Revanth
CM Revanth Chief Minister Revanth showered blessings on Narsampet

ఈ సందర్భంగా రేవంత్ (CM Revanth) రెడ్డి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, మాధవన్న తనను అడగకుండానే అన్ని అడుగుతున్నాడని అన్నారు. “ఒకింత రిక్వెస్ట్ చేసినట్టే చేసి నిధులు, ఇల్లు కావాలంటూ ఆర్డర్ కూడా వేశాడని” అనడంతో సభలో నవ్వులు పూశాయి. మాధవన్న తన వ్యక్తిగత లాభాపేక్షకు కాకుండా నిరుపేదలకు మరో 3 వేల ఇందిరమ్మ ఇళ్లు అడగడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి కొనియాడారు. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే తన కోటా నుంచి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ నుంచి పొంగులేటికి ఆదేశాలు జారీ చేశారు.

మాధవరెడ్డి కోరిన నిధులు మరియు ప్రాజెక్టుల వివరాలు

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన ప్రసంగంలో నర్సంపేటకు ముఖ్యమంత్రి రూ. 1000 కోట్ల నిధులు మంజూరు చేశారని, ఇందులో రూ. 600 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారని తెలిపారు. అదేవిధంగా, నియోజకవర్గానికి ఇంకా అవసరమైన నిధుల వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు:

  • యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్: రూ. 200 కోట్లు.
  • మెడికల్ కళాశాల: రూ. 150 కోట్లు మంజూరు కాగా, అదనంగా రూ. 12 కోట్లు అవసరం.
  • నర్సింగ్ కళాశాల నిర్మాణం: రూ. 26 కోట్లు.
  • మున్సిపాలిటీ అభివృద్ధి: రూ. 25 కోట్లు.
  • నర్సంపేట పట్టణానికి: రింగ్ రోడ్డు, అండర్ డ్రైనేజీకి నిధులు.
  • పాకాల సరస్సు అభివృద్ధి: కాల్వల అభివృద్ధికి రూ. 140 కోట్లు, మొత్తం పాకాల అభివృద్ధి కోసం రూ. 1000 కోట్లు కేటాయించాలని డిమాండ్.
  • విద్యుత్: 133 కేవీ సామర్థ్యం గల సబ్ స్టేషన్లు అవసరం.

ఈ సభలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, గండ్ర సత్యనారాయణ, రాంచందర్ నాయక్, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నీటిలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి

నీటిలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి

పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు.. జాతీయ జెండా ఎగరేసిన గవర్నర్

పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు.. జాతీయ జెండా ఎగరేసిన గవర్నర్

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా రిపబ్లిక్ డే వేడుకలు

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా రిపబ్లిక్ డే వేడుకలు

గణతంత్ర దినోత్సవం.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

గణతంత్ర దినోత్సవం.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే

తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే

ఎంబీసీ జాబితాలో 14 కొత్త కులాలు.. 11 లక్షల మందికి లబ్ధి

ఎంబీసీ జాబితాలో 14 కొత్త కులాలు.. 11 లక్షల మందికి లబ్ధి

కడుపునొప్పి కారణంగా మహిళ ఆత్మహత్య

కడుపునొప్పి కారణంగా మహిళ ఆత్మహత్య

గణతంత్ర దినోత్సవం వేళ మద్యం షాపులకు తాళం

గణతంత్ర దినోత్సవం వేళ మద్యం షాపులకు తాళం

నాంపల్లి అగ్నిప్రమాదం – మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు

నాంపల్లి అగ్నిప్రమాదం – మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు

బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

బస్సు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

గంజాయి ముఠా దాడి.. మహిళా కానిస్టేబుల్ పరిస్థితి విషమం

గంజాయి ముఠా దాడి.. మహిళా కానిస్టేబుల్ పరిస్థితి విషమం

జిల్లా కలెక్టర్లకు SEC కీలక ఆదేశాలు

జిల్లా కలెక్టర్లకు SEC కీలక ఆదేశాలు

📢 For Advertisement Booking: 98481 12870