हिन्दी | Epaper

CM Revanth : ఆ భూములను వదిలేయండి అంటూ సినీ స్టార్స్ రిక్వెస్ట్

Sudheer
CM Revanth : ఆ భూములను వదిలేయండి అంటూ సినీ స్టార్స్ రిక్వెస్ట్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం 400 ఎకరాల భూమిని ఐటీ పార్క్ కోసం ఉపయోగించాలని తీసుకున్న నిర్ణయంపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ భూములను వదిలేయాలని, అభివృద్ధి కోసం ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

సినీ స్టార్స్ రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి

హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై రేణు దేశాయ్, రష్మిక మందన్న, సమంత, ఉపాసన, అనసూయ, రామ్ చరణ్ భార్య ఉపాసన లాంటి ప్రముఖులు స్పందించారు. రాత్రికి రాత్రే బుల్డోజర్లు, విద్యార్థుల అరెస్టులు వంటి ఘటనలపై విమర్శలు గుప్పించారు. రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో “హెచ్‌సీయూలో నిజంగా ఏమి జరుగుతోంది?” అంటూ ప్రశ్నించింది. సమంత “చెట్లను నరకడం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, జంతువులు, పక్షులు కాపాడుకోవాలి” అంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

పర్యావరణ పరిరక్షణపై గళం విప్పిన సినీ ప్రముఖులు

నాగ్ అశ్విన్, దియా మీర్జా, అనసూయ, రేణు దేశాయ్ లాంటి ప్రముఖులు కూడా ఈ భూములను కాపాడాలని, పర్యావరణ పరిరక్షణ ముఖ్యమని అభిప్రాయపడ్డారు. రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసి, “భవిష్యత్తు తరాల కోసం ఈ భూములను అలాగే వదిలేయాలి” అని కోరింది. ఉపాసన కూడా “చెట్లను నరికితే మూగజీవాలు ఎక్కడికెళ్లాలి?” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

సినీ స్టార్స్ రిక్వెస్ట్
CM Revanth

పరిస్థితి పొలిటికల్ టర్న్

400 ఎకరాల భూముల వివాదంపై విద్యార్థులు, పర్యావరణ వేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించడంతో వివాదం మరింత వేడెక్కింది. పచ్చటి అడవిని నరికివేయడం పర్యావరణానికి హాని చేస్తుందని, జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తుందని ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు. ఈ వివాదంపై సినీ, రాజకీయ ప్రముఖులు మరింత ఎలా స్పందిస్తారో చూడాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870