हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

చిరంజీవి తల్లికి అస్వస్థత వార్తల్లో నిజం లేదు.

Anusha
చిరంజీవి తల్లికి అస్వస్థత వార్తల్లో నిజం లేదు.

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని ఉదయం నుంచీ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెల్లవారుజామున ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారని, మెగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. దీనితో అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.అంజనాదేవి అనారోగ్యం విషయం తెలిసిన వెంటనే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడలో ఉన్న తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారని వార్తలు వచ్చాయి. అధికారులతో జరగాల్సిన సమీక్షలు, అనేక కార్యక్రమాలను పవన్ రద్దు చేసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో అంజనాదేవి ఆరోగ్యం విషయంలో అభిమానులు మరింత ఆందోళనకు గురయ్యారు.

చిరంజీవి టీమ్ క్లారిటీ

అయితే, ఈ వార్తలపై చిరంజీవి టీమ్ అధికారికంగా స్పందించింది. అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఆమె ఆరోగ్యపరమైన సమస్యలు ఏమీలేవని, కేవలం సాధారణ వైద్య పరీక్షల నిమిత్తమే ఆసుపత్రికి వెళ్లారని వెల్లడించారు. గత వారం ఆమె కొన్ని రెగ్యులర్ చెకప్‌లు చేయించుకున్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

anjana devi 031024 2

ఇటీవలే ఆమె పుట్టినరోజును చిరంజీవి కుటుంబం ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ, తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

రెగ్యులర్ చెకప్

అయితే అంజనా దేవి రెగ్యులర్ చెకప్ కోసం హాస్పటల్ కు వెళ్లినట్టు పీఆర్ టీమ్ తెలిపింది. అంజనాదేవికి అస్వస్థత అనే వార్తలు ఒక్కసారిగా రావడంతో అభిమానులు ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు ఆమె కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే హాస్పటల్ కు వెళ్లారు అని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు మెగా ఫ్యాన్స్.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870