Good News : ఆ ఆసుపత్రుల్లోనే నగదు రహిత చికిత్స – మంత్రి పొన్నం

Read Time:  1 min
Ponnam Prabhakar: మహంకాళి బోనాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష
Ponnam Prabhakar: మహంకాళి బోనాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష
FONT SIZE
GET APP

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) రోడ్డు ప్రమాద బాధితులకు సంబందించి శుభవార్త చెప్పారు. ప్రమాదం జరిగిన వారంలోపు బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స (Cashless treatment) అందించనున్నట్లు వెల్లడించారు. ఈ సౌకర్యం కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం కింద పొందుపరిచిన చొప్పదండి, జగిత్యాల, మెదక్ తదితర జిల్లాల్లోని ఆసుపత్రుల్లో అందుబాటులోకి రానుంది. ఈ పథకంతో బాధితులు ఆసుపత్రిలో వైద్యం కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చుచేయాల్సిన అవసరం లేకుండా పోతుందని మంత్రి తెలిపారు.

ఆయుష్మాన్ భారత్ ఆసుపత్రుల్లోనే వర్తింపు

ఈ పథకం కింద నగదు రహిత వైద్యం ఆయుష్మాన్ భారత్‌ పథకానికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పందించాల్సిందిగా, అలాగే ఈ-దార్ (e-DAR) పోర్టల్‌ లో వివరాలు నమోదు చేయాలని మంత్రి సూచించారు. సమాచారం నమోదైన వెంటనే బాధితులకు చికిత్స కోసం ప్రాసెస్ మొదలవుతుందని తెలిపారు. ఇందులో ప్రభుత్వంతోపాటు ప్రైవేటు ఆసుపత్రులు కూడా భాగస్వాములవుతాయని చెప్పారు.

కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పొన్నం

ఈ కీలక నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఇది నిజంగా ప్రజలకు అవసరమైన, ప్రాణాలను కాపాడగలిగే చొరవ అని కొనియాడారు. ఈ పథకంతో ప్రతి రోడ్డు ప్రమాద బాధితుడు సరైన సమయంలో మెరుగైన వైద్యం పొందగలడని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఈ అంశంపై పోలీస్‌, వైద్య, రవాణా శాఖల మధ్య సమన్వయం పెంచేందుకు చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.

Read Also : Big Alert : వెంటనే అకౌంట్స్ పాస్ వర్డ్స్ మార్చుకోండి

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.