हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Breaking News – Urea Shortage : యూరియా కొరతపై బిఆర్ఎస్, బీజేపీ డ్రామాలు – రేవంత్

Sudheer
Breaking News – Urea Shortage : యూరియా కొరతపై బిఆర్ఎస్, బీజేపీ డ్రామాలు – రేవంత్

తెలంగాణలో నెలకొన్న యూరియా కొరత(Urea Shortage)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఏసీ (రాజకీయ వ్యవహారాల కమిటీ) సమావేశంలో స్పందించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసి యూరియా కొరతపై డ్రామాలు ఆడుతున్నాయని ఆయన తీవ్రంగా ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కొరతను సృష్టించి, తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఆ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని సీఎం అన్నారు. ఈ సమస్యను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఫైర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. “యూరియా ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని కేటీఆర్ అనడంలోనే వాళ్ల తీరు అర్థమవుతోంది” అని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల అవసరాలను బేరం పెడుతున్నారని ఆయన విమర్శించారు. రైతుల సమస్యలను రాజకీయం చేయడం బీఆర్ఎస్ పార్టీకి తగదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం తాను నాలుగుసార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్‌ను కలిసినట్లు సీఎం వెల్లడించారు.

క్షేత్రస్థాయిలో మానిటరింగ్ పెంచాలని ఆదేశాలు

యూరియా పంపిణీలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పంపిణీపై మానిటరింగ్ పెంచాలని ఆయన సూచించారు. యూరియా కొరతను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని, కావాలని కొందరు ఈ సమస్యను సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, వారికి అవసరమైన యూరియాను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

https://vaartha.com/congress-committee-for-local-body-elections/breaking-news/535194/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870