हिन्दी | Epaper
అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

బాంబు బెదిరింపు..శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

sumalatha chinthakayala
బాంబు బెదిరింపు..శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

హైదరాబాద్‌: దేశంలో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ ఆగడం లేదు. తాజాగా బాంబు బెదిరింపులతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బ్యాంకాక్‌కు విమానం బయలుదేరింది. అయితే విమానం బయలుదేరిన కాసేపటికే ఓ కాల్ కాలవడంతో విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. విమానంలో బాంబు ఉందంటూ ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. విమానంలో ప్రయాణికులను దింపి భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఎటువంటి బాంబు లేదని నిర్ధారించారు. ఇది ఫేక్‌ కాల్‌గా అధికారులు తేల్చారు.

కాగా, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ విమానంలో బాంబు పెట్టారంటూ కాల్ రావడంతో అధికారులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు వెళ్తున్న విమానంలో బాంబు ఉందంటూ సిబ్బందికి సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాన్ని ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సీఐఎస్‌ఎఫ్ అధికారులతో పాటు మిగిలిన అధికారులు పూర్తిస్థాయిలో విమానాన్ని తనిఖీలు చేశారు. అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన తర్వాత దాదాపు గంటకు పైగా అధికారులు విమానాన్ని పూర్తిస్థాయిలో సోదాలు చేశారు. అయితే విమానంలో ఎలాంటి బాంబు లేదని.. ఆ కాల్ ఫేక్ కాల్ అని అధికారులు గుర్తించారు. మరోవైపు ఓ ప్రయాణికుడు కూడా విమానంలో బాంబు పెట్టారని చెప్పడంతో అతడిని కూడా ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అయితే గత రెండు వారులుగా శంషాబాద్ విమానాశ్రయానికి ఐదోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అలాగే దేశవ్యాప్తంగా కూడా వరుసగా ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అందులో భాగంగానే శంషాబాద్ విమానాశ్రయానికి దాదాపు ఐదు సార్లు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో సీఐఎస్‌ఎఫ్ అధికారులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఈరోజు కూడా బాంబు బెదిరింపు కాల్ రావడంతో.. ప్రయాణికులు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని చెబుతూ వారిని విమానంలో నుంచి దింపేసిన తర్వాత పూర్తిస్థాయిలో తనిఖీలు చేశారు. అయితే బాంబు లేకపోవడంతో పాటు ఫేక్‌ కాల్ అని అధికారులు గుర్తించారు. అలాగే కాల్ చేసిన వ్యక్తితో పాటు సదరు ప్రయాణికుడిని కూడా అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870