हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

దక్షిణాదిలో బీజేపీకి తగిన ప్రాతినిధ్యం లేదు – సీఎం రేవంత్

Sudheer
దక్షిణాదిలో బీజేపీకి తగిన ప్రాతినిధ్యం లేదు – సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశంపై తీవ్రంగా స్పందించారు. దక్షిణాదిలో బీజేపీకి తగిన ప్రాతినిధ్యం లేదని, ఇటీవలి ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కేవలం 29 ఎంపీ స్థానాలు మాత్రమే గెలుచుకున్నట్లు గుర్తు చేశారు. దక్షిణ భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ బీజేపీ పూర్తి స్థాయిలో అధికారంలో లేదని, ఆంధ్రప్రదేశ్‌లో కేవలం జూనియర్ భాగస్వామిగానే ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తూ, డీలిమిటేషన్‌ను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తోందని ఆరోపించారు.

డీలిమిటేషన్ అమలు ఆ రాష్ట్రాలకే లాభం

డీలిమిటేషన్ అమలు అయితే దక్షిణాది రాష్ట్రాలకు కాకుండా ఉత్తరాది రాష్ట్రాలకు లాభం కలుగుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ చర్యలను సమర్థంగా అమలు చేశాయని గుర్తుచేశారు. అయితే, ఇప్పుడు అదే కేంద్రం ఈ అంశాన్ని ఉద్దేశపూర్వకంగా వాడుకుంటూ, డీలిమిటేషన్ ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ పార్లమెంట్ స్థానాలు కేటాయించే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై మోదీ స్పందన

డీలిమిటేషన్‌ను మరికొన్ని దశాబ్దాలు వాయిదా వేయాలి

డీలిమిటేషన్‌ను మరికొన్ని దశాబ్దాలు వాయిదా వేయాలని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. మరో 30 సంవత్సరాలు దక్షిణాదిలో జనాభా పెరుగుదల ఎలా ఉంటుందో చూడాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని, ఏకపక్షంగా డీలిమిటేషన్‌ను అమలు చేయడం దక్షిణాదికి అన్యాయం చేయడమే అవుతుందని వ్యాఖ్యానించారు. జనాభా పెరుగుదల ఆధారంగా మాత్రమే ఎన్నికల నియోజకవర్గాలను పెంచడం సరైన విధానం కాదని ఆయన స్పష్టం చేశారు.

దక్షిణాది రాష్ట్రాలు తగిన విధంగా దీనిపై స్పందించాలి

జాతీయ స్థాయిలో జరిగిన ఇండియా టుడే సదస్సులో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, దక్షిణాది రాష్ట్రాలు తగిన విధంగా స్పందించాలని సూచించారు. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలను కించపరిచే విధంగా డీలిమిటేషన్ చట్టాలను రూపొందించడం అన్యాయమని, ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870