हिन्दी | Epaper
హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

News telugu: Kumram Bheem District- దంపతులపై ఎలుగుబంటి దాడి.. ఇద్దరూ మృతి

Sharanya
News telugu: Kumram Bheem District- దంపతులపై ఎలుగుబంటి దాడి.. ఇద్దరూ మృతి

తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అడవిలో పశువులను మేపేందుకు వెళ్లిన దంపతులపై ఎలుగుబంటి దాడి (Bear attack)చేసి ప్రాణాలు తీసిన ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.

అడవిలో పశువుల మేపుతు దంపతులపై దాడి

సిర్పూర్‌ (Sirpur) మండలానికి చెందిన అచ్చెల్లి గ్రామ వాసులు దూలం శేఖర్ (45), ఆయన భార్య సుశీల (38) పశుపోషణతో జీవనం సాగిస్తున్నారు. గురువారం రోజు తన పశువులతో కలిసి సమీపంలోని పెద్దబండ అటవీ ప్రాంతానికి వెళ్లిన ఈ దంపతులు, రాత్రి వరకు ఇంటికి తిరిగిరాలేదు.

పశువులు ఇంటికి.. కానీ దంపతుల రాక లేదు

సాయంత్రానికి పశువులు మామూలుగానే ఇంటికి తిరిగివచ్చినా, శేఖర్ దంపతులు రాకపోవడంతో వారి పిల్లలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి, వెంటనే శేఖర్‌కి ఫోన్ చేయడానికి ప్రయత్నించారు. అయితే, ఆయన నుంచి స్పందన రాకపోవడంతో పోలీసులు ఆశ్రయించారు.

గాలింపు చర్యలు.. సెల్‌ఫోన్‌ సిగ్నల్ ఆధారంగా గుర్తింపు

సీఐ సంతోష్‌, ఎస్సై సురేశ్ నేతృత్వంలోని పోలీస్ బృందాలు గ్రామస్తులతో కలిసి అడవిలో గాలింపు చేపట్టారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో శేఖర్‌ సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా దంపతుల ఉన్న స్థలాన్ని గుర్తించి అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు.

చనిపోయిన స్థితిలో దంపతుల మృతదేహాలు

శేఖర్, సుశీల విగతజీవులుగా అడవిలో పడి ఉన్న దృశ్యం స్థానికులను తీవ్ర విషాదంలో ముంచింది. వారి మృతదేహాలను సిర్పూర్‌ (టి) ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.శుక్రవారం ఉదయం కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహిదొద్దీన్‌, డీఎఫ్‌వో సుశాంత్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా ఇది అడవి ఎలుగుబంటి దాడిగా స్పష్టమైంది.

ప్రభుత్వ స్పందన: ₹20 లక్షల పరిహారం, ఉద్యోగ హామీ

ఈ దారుణ ఘటనపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖకు సమాచారం అందించగా, వారు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. డీఎఫ్‌వో సుశాంత్ మాట్లాడుతూ, బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని, అలాగే కుటుంబంలోని ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870