Janagama: జనగామలో బీసీ బంద్ ఉద్రిక్తత – కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ

Read Time:  1 min
Janagama
Janagama
FONT SIZE
GET APP

తెలంగాణలో బీసీ బంద్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. జనగామలో(Janagama) బీసీ బంద్ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీసీ ఓట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి డ్రామా ఆడారంటూ బీఆర్ఎస్ నాయకుడు ఒకరు చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహించిన కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. మాటామాటా పెరిగి, ఇద్దరి మధ్య ఉద్రిక్తత నెలకొంది.

Read Also: TDP: ఎక్కడి గొంగళి అక్కడే

Janagama: సమావేశ స్థలంలో కాంగ్రెస్ నేతలు దూసుకెళ్లి ఆ బీఆర్ఎస్ నేతపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి వేడెక్కింది. వెంటనే మిగతా నాయకులు, పోలీసులు జోక్యం చేసుకొని వారిని శాంతింపజేశారు. కొద్ది సేపటికి పరిస్థితి అదుపులోకి వచ్చినా, స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది.

పోలీసులు అక్కడ అదనపు బలగాలను మోహరించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షణ చేపట్టారు. బీసీ బంద్ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు బీసీ సంఘాలు తమ డిమాండ్లను తీరుస్తూ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Shiva

రచయిత గురించి

Shiva

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.