हिन्दी | Epaper
రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు రైతులకు శుభవార్త నిమ్స్ స్టెమ్ సెల్ ల్యాబ్ ప్రారంభం లక్కీ డ్రా స్కామ్‌పై సైబర్ చర్యలు

Bandi Sanjay Kumar : సింగరేణి ATMలా మారిందా? బండి సంజయ్ సంచలనం!

Sai Kiran
Bandi Sanjay Kumar : సింగరేణి ATMలా మారిందా? బండి సంజయ్ సంచలనం!

Bandi Sanjay Kumar : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి Bandi Sanjay Kumar కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కరీంనగర్‌లో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ, సింగరేణి సంస్థను ఈ రెండు పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ATMగా మార్చేశాయని విమర్శించారు. దశాబ్దకాలంగా జరిగిన దోపిడీ కారణంగా సింగరేణి రూ.42 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

2014 నుంచి సింగరేణిలో భారీ అవకతవకలు జరిగాయని, K. Chandrashekar Rao కుటుంబం సంస్థను దోచుకుందని బండి సంజయ్ ఆరోపించారు. అవకతవకలకు సంబంధించిన కీలక రికార్డులను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఆలస్యం జరిగితే సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సింగరేణిపై విచారణ జరపాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు.

Read Also: Manoj Tiwary: కెప్టెన్‌ బాధ్యతలను రోహిత్ శర్మకు ఇవ్వాలి

Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar

ఫోన్ ట్యాపింగ్ కేసుపై సంచలన వ్యాఖ్యలు (Bandi Sanjay Kumar) చేసిన సంజయ్, ఈ వ్యవహారం విచారణలా కాకుండా టీవీ సీరియల్‌లా మారిందని ఎద్దేవా చేశారు. ట్యాపింగ్ జరగలేదని కేసీఆర్ కుటుంబం దైవసాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల కేంద్రంగా ఈ అరాచకాలు జరిగాయని, తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు.

సింగరేణి ఆస్తులపై వాలుతున్న రాబందుల నుంచి సంస్థను కాపాడతామని సంజయ్ స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణికి పూర్వ వైభవం తీసుకొస్తామని, దోపిడీకి పాల్పడ్డ వారిని బయటపెడతామని ధీమా వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870