हिन्दी | Epaper
గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telugu News: Bandi Sanjay Kumar: కుక్క కాటుకు మందు లేదా?

Sushmitha
Telugu News: Bandi Sanjay Kumar: కుక్క కాటుకు మందు లేదా?

హుస్నాబాద్ రూరల్: ప్రభుత్వ ఆసుపత్రులలో కుక్క కాటుకు కూడా మందు అందుబాటులో లేని దుస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హుస్నాబాద్ (Husnabad) ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన, పేద, మధ్యతరగతి ప్రజలకు సర్కారు దవాఖానాల్లో మందులు లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎన్ఎండీసీ (NMDC) సంస్థ సహకారంతో సీఎస్‌ఆర్ (CSR) నిధులతో దాదాపు రూ.కోటి విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశారు.

 Read Also: Kavitha: నిరంజన్ రెడ్డి అవినీతిపై పిల్లాడిని అడిగినా చెబుతాడు: కవిత

Bandi Sanjay Kumar
Bandi Sanjay Kumar Is there no medicine for dog bites?

కొత్త వైద్య పరికరాల ప్రారంభం, రోగులతో సంభాషణ

మంత్రి బండి సంజయ్ ప్రారంభించిన వైద్య పరికరాలలో ఈసీజీ మిషన్లు, అల్ట్రాసౌండ్, ఈఎన్టీ, సర్జికల్ మైక్రోస్కోప్, మల్టిపుల్ మానిటర్లు, మార్చురీ కేబినెట్ సహా మొత్తం 15 రకాల వైద్య పరికరాలు (మెడికల్ ఎక్విప్‌మెంట్స్) ఉన్నాయి. ఆయా పరికరాల ద్వారా అందించే సేవలను గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులను కలిసి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. డాక్టర్లతో సమావేశమై ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వాలపై విమర్శలు, వైద్యులకు సూచనలు

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, సర్కార్ ఆసుపత్రులకు వచ్చే వారంతా పేద, మధ్య తరగతి ప్రజలేనని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేసుకోలేని వాళ్లేనని అన్నారు. “సూది మందుతో పాటు కనీస సౌకర్యాలు లేకపోతే పేదల పరిస్థితి ఏంటి, వారు చావాల్సిందేనా?” అని ప్రశ్నించారు. విద్య, వైద్య రంగాలకు సంబంధించి పేదలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, దురదృష్టవశాత్తు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని విమర్శించారు.

“ఇక్కడికి వచ్చే రోగులకు సూదుల్లేవు, మందుల్లేవు, టెస్టులు చేయడానికి పరికరాల్లేవు అనే వార్తలు చూశాను. కుక్క కాటుకు మందు కూడా లేదని వార్తలొస్తున్నాయంటే పేదల పరిస్థితి ఏంది, వారు చనిపోవాల్సిందేనా?” అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేంద్ర నిధులతోనే దాదాపు సర్కార్ ఆసుపత్రులు అన్ని నడుస్తున్నాయని, నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా పెద్ద ఎత్తున అత్యాధునిక పరికరాలకు నిధులు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధులు ఇవ్వకపోవడం వల్ల చిన్న చిన్న మెడికల్ పరికరాల కొనుగోలు చేయలేక ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొన్నారు.

తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన పరికరాలను, సాయాన్ని అందించేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. “ఇకపై ఒక్క పేషెంట్ కూడా ట్రీట్‌మెంట్ కోసం బయటకు వెళ్లే పరిస్థితి రానీయొద్దు. ఈ ఆసుపత్రికి ఇంకా ఏమేం కావాలో చెప్పండి, అన్ని సౌకర్యాలను సమకూరుస్తాను” అని హామీ ఇచ్చారు. వైద్యులు పేదలకు సేవ చేయడం మహా భాగ్యం అని, మానవ సేవే మాధవ సేవ అని గుర్తుంచుకుని సేవలందించాలని కోరారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ ఏ ఆసుపత్రిని సందర్శించారు?

హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు.

NMDC సంస్థ సహకారంతో ఆసుపత్రికి ఎన్ని కోట్ల విలువైన పరికరాలను అందించారు? దాదాపు రూ.కోటి విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను అందించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870