ఇటీవల కరీంనగర్ రూరల్ మండలంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో చర్చలపై స్పష్టమైన వైఖరిని ప్రకటిస్తూ… “మావోయిస్టులతో మాట్లాడే ప్రసక్తే లేదు. తుపాకీ విసరాల్సిందే. పోలీసులకు లొంగిపోవాల్సిందే. వారి ప్రవర్తన మారాల్సిందే” అని ఆయన పేర్కొన్నారు. నిషేధిత సంస్థతో చర్చలు జరపడం సరికాదని, అది ప్రజలకు తప్పుదారి చూపే పని అవుతుందని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మావోయిస్టు సమస్యను సామాజిక కోణంలో చూడాలన్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బండి సంజయ్, తుపాకులు పట్టుకుని అమాయకులను చంపడం, బాంబులు అమర్చి పోలీసులను హత్య చేయడం సామాజిక కోణమా? అంటూ ప్రశ్నించారు. గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు మావోయిస్టులపై నిషేధం విధించాయని గుర్తు చేస్తూ, ఇప్పుడు అదే కాంగ్రెస్ నాయకులు చర్చలు జరపాలంటూ మాట్లాడటం ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు.మావోయిస్టుల హింసాకాండపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. తెలంగాణలో మాత్రం ప్రభుత్వం తూతూ మంత్రంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రోహింగ్యాలు, పాక్ పౌరులు వీసా, పాస్ పోర్టుల్లేకుండా నివసించడం శాంతిభద్రతలకు హానికరం అని హెచ్చరించారు.

Bandi Sanjay : మావోయిస్టులతో చర్చలపై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
కాళేశ్వరం అంశంపై ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. కాంగ్రెస్–బీఆర్ఎస్ కలసి మావోయిస్టులతో చర్చల పేరుతో ప్రజలను దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. బీసీల జనాభాను తక్కువగా చూపి కాంగ్రెస్ రిజర్వేషన్ల విషయంలో తీవ్ర అన్యాయం చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోందని చెప్పారు.ఇటీవలి పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్ వ్యాఖ్యలు మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వ దృఢమైన వైఖరిని మరల ఒకసారి స్పష్టం చేశాయి. శాంతిభద్రతలను కాపాడటంలో సమగ్ర చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.ఇలాంటి ఘాటైన విమర్శలు, రాజకీయ విమర్శల మధ్య మావోయిస్టుల సమస్యపై చర్చలు, నిషేధాలు, ప్రజా అభిప్రాయాలు కేంద్ర బిందువుగా మారుతున్నాయి.
Read More : Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..