ప్రజల విశ్వాసాన్ని దుర్వినియోగం చేస్తూ కొందరు దొంగ బాబాలు (Thieves) దోచుకుంటున్నారు. ఆర్థికంగా కుంగిపోయినవారిని, అనారోగ్యంతో బాధపడుతున్నవారిని లక్ష్యంగా చేసుకుని గుప్త నిధుల మాయ చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి మోసాలు జరుగుతున్నా, తాజాగా కరీంనగర్లో ఓ ముఠా అరెస్ట్ (A gang was arrested in Karimnagar) కావడం చర్చనీయాంశమైంది.శ్రీరాములపల్లె గ్రామానికి చెందిన గజ్జి ప్రవీణ్ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక దొంగ బాబా దగ్గరకు వెళ్లాడు. అదే అతని మోసాల మొదలు అయింది.

బంగారం ఉందని చెప్పి బెదిరింపులు
దొంగ బాబా ముఠా అతనికి బంగారం మీ ఇంటి పక్కనే పాతిపెట్టబడి ఉందని నమ్మించారు. దాన్ని బయటకు తీయాలంటే ప్రత్యేక పూజలు చేయాలనీ, లేదంటే కుటుంబం ప్రమాదంలో పడుతుందని బెదిరించారు. భయంతో గజ్జి ప్రవీణ్ చెప్పినవన్నీ నమ్మాడు.దశలవారీగా పూజలు చేస్తామని చెప్పి దొంగ బాబాల గ్యాంగ్ అతని నుంచి మొత్తం రూ.15.30 లక్షలు వసూలు చేశారు. కొంత పూజ సామాగ్రి కొన్నారు. తర్వాత ఓ గొయ్యి తవ్వి అందులో ముందే దాచిన డబ్బా తీసి “ఇదే బంగారం” అని నమ్మబలికారు. ఇంకా డబ్బులు కావాలని పీడించారు.
కొత్తపల్లికి వెళ్లిన బాధితుడు, పోలీసులకు ఫిర్యాదు
ఇంకా డబ్బులు ఇవ్వలేనని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు.ఈన్నాల రాజు, మిర్యాల దుర్గయ్య, పెనుగొండ రాజు, చల్ల అజయ్, ఈర్నాల సతీశ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.15.30 లక్షలు, ఏడు తులాల బంగారం, మూడు కార్లు, ఏడున్నర మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్ తెలిపారు.ఇలాంటి మోసాలకు పాల్పడే దొంగ బాబాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గుప్త నిధులు, పూజల పేరుతో డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. విశ్వాసం పేరిట మోసం చేసే వాడిని నమ్మవద్దు.
Read Also : Ponguleti Srinivasa Reddy : కేటీఆర్ ఓ దద్దమ్మ అంటూ మంత్రి పొంగులేటి ఫైర్