हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి

Sharanya
పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి

సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి పొందింది. ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండేళ్లకు ఒకసారి జరిగే పెద్దగట్టు జాతరకు ఇప్పటికే సర్కార్ నిధులు విడుదల చేసింది. జాతర ఏర్పాట్ల కోసం నిధులు మంజూరు చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.

Peddagattu Jathara Durajpalli Photos 1

ప్రభుత్వ నిధులు మంజూరు:
రెండేళ్లకోసారి జరిగే పెద్దగట్టు జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్లు మంజూరు చేసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డికు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రయాణ ఛార్జీలు:
ప్రత్యేక బస్సు సేవలు భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ 60 ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తెచ్చింది.
పెద్దలకు – రూ. 40, పిల్లలకు – రూ. 20 టీజీఎస్ఆర్టీసీ నల్లగొండ రీజినల్ మేనేజర్ కె. జానిరెడ్డి ప్రకారం, వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు హాజరవుతారు. భక్తుల సౌకర్యం కోసం సూర్యాపేట డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది భక్తుల రాకపోకలకు విఘాతం కలగకుండా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశారు. ఆలయం, ప్రధాన రహదారులు, బస ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

జాతర ఏర్పాట్లను పర్యవేక్షణ:
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు సహా అధికారులు ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పారిశ్యుద్ద పనులు లైటింగ్ సివిల్ పనులు చేయించాం. జాతర ముగిసేవరకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశ్యుద్ద సిబ్బంది, ప్రత్యేక అధికారులను అందుబాటులో ఉంచుతాం. అని మున్సిపల్ కమిషినర్ ఆదేశించారు జాతర ప్రాంతంలో 24/7 విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నారు. భక్తుల కోసం వైద్య బృందాలు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు.

భక్తుల కోసం ప్రత్యేక సూచనలు:
భక్తులు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను వినియోగించుకోవాలి. జాతర ఏర్పాట్లు పూర్తి కావడంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా యాత్రను కొనసాగించవచ్చు. ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ, వైద్య బృందాలు రంగంలోకి దిగాయి. భక్తులు పెద్దగట్టు జాతరకు విచ్చేసి లింగమంతుల స్వామి ఆశీస్సులు పొందాలని అధికారులు కోరారు. భక్తులు జాతరను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అధికారుల సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870